NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy: టీమిండియా ప్లేయ‌ర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు.. బీసీసీఐ పై మండిపడిన ఐసీసీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy: టీమిండియా ప్లేయ‌ర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు.. బీసీసీఐ పై మండిపడిన ఐసీసీ
    టీమిండియా ప్లేయ‌ర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు.. బీసీసీఐ పై మండిపడిన ఐసీసీ

    Champions Trophy: టీమిండియా ప్లేయ‌ర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు.. బీసీసీఐ పై మండిపడిన ఐసీసీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ వేదికగా 2025 ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

    అయితే బీసీసీఐ, ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌కు వెళ్లమని ఐసీసీకి స్పష్టంగా చెప్పింది.

    మొదట్లో పాకిస్థాన్, భారత జట్టు తమ దేశంలో పర్యటించాల్సిందేనని పట్టుబట్టింది.

    కానీ, ఐసీసీ చర్చల తర్వాత పాకిస్థాన్ తన వైఖరి మార్చి, హైబ్రిడ్ మోడ్‌ను అంగీకరించింది.

    దీనివల్ల టీమిండియా మ్యాచులు దుబాయ్‌లో జరగనున్నాయి. దీని ద్వారా వివాదం ముగిసినట్లుగా భావించారు. టోర్నీకి ఎలాంటి ఆటంకాలు ఉండవని భావించారు.

    వివరాలు 

    ప్లేయర్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉండడంపై భారత్ అభ్యంతరం

    అయితే, ఇప్పుడు మరొక వివాదం తలెత్తినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

    భారత జట్టులోని ప్లేయర్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉండడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

    పాకిస్థాన్ పేరును జెర్సీపై ముద్రించలేమని బీసీసీఐ ఐసీసీకి తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

    ఐసీసీ నిబంధనల ప్రకారం, మెగాటోర్నమెంట్లలో పాల్గొనే జట్ల జెర్సీపై ఆ టోర్నీ పేరు , ఆతిథ్య దేశం పేరు తప్పనిసరిగా ఉండాలి.

    అయితే బీసీసీఐ, పాకిస్థాన్ పేరును జెర్సీపై ముద్రించలేమని తెలిపింది. భారత్ మ్యాచులు దుబాయ్ వేదికగా జరుగుతాయి కాబట్టి ఆతిథ్య దేశం పేరు అవసరం లేదని బీసీసీఐ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    వివరాలు 

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత షెడ్యూల్

    ఐసీసీ నిబంధనల ప్రకారం, ప్లేయర్ల జెర్సీలపై టోర్నమెంట్ లోగోతో పాటు ఆతిథ్య దేశం పేరు ఉండాల్సిందే.

    టీమిండియా ఈ నిబంధన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

    భారత్ ఫిబ్రవరి 20న తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. గ్రూప్ దశలో భారత చివరి మ్యాచ్ మార్చి 2న జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    బీసీసీఐ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    ఐసీసీ

    Team India : ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీ.. 2024 షెడ్యూల్ ఇదే.. టీమిండియా
    ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్ తీసుకొచ్చిన ఐసీసీ.. ఇక బ్యాటర్లకు పండగే క్రికెట్
    ICC T20I Team Of The Year 2023: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసిన ఐసిసి క్రీడలు
    Rohit Sharma: 'వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌' కెప్టెన్ గా రోహిత్ శర్మ.. టీంలో 6మంది భారతీయులకు చోటు  రోహిత్ శర్మ

    బీసీసీఐ

    Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు భారీ షాక్‌.. రెండో టెస్టు జట్టు నుంచి తప్పించనున్న బీసీసీఐ టీమిండియా
    IPL 2025 Auction RTM Card: ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ లీక్.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగుర్ని రిటైన్‌ చేసుకోవచ్చు..! ఐపీఎల్
    NCA: బెంగళూరులో కొత్త 'ఎన్‌సీఏ' ప్రారంభం.. బీసీసీఐ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు  బెంగళూరు
    IPL 2025: "ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ అవసరం": బీసీసీఐ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్‌.. ఆనందోత్సహాలలో అభిమానులు  ఎంఎస్ ధోని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025