NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli : ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వస్తే.. జట్టులో కీలక మార్పులు: మంజ్రేకర్
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli : ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వస్తే.. జట్టులో కీలక మార్పులు: మంజ్రేకర్
    ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వస్తే.. జట్టులో కీలక మార్పులు: మంజ్రేకర్

    Virat Kohli : ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వస్తే.. జట్టులో కీలక మార్పులు: మంజ్రేకర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 18, 2024
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది.

    ప్రస్తుతానికి అన్ని ఫ్రాంచైజీలు కనిష్ఠంగా ఇద్దరు నుంచి గరిష్ఠంగా ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి కొన్ని జట్లకు కొత్త సారథిని నియమించాల్సి ఉంది.

    అయితే ఆర్సీబీ గత సీజన్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేయలేదు. దీంతో, సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరోసారి కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు లేకపోలేదు.

    ఒకవేళ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వస్తే, జట్టులో పాత సహచరుడు యుజ్వేంద్ర చాహల్‌ తీసుకోవచ్చని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.

    అయితే చాహల్‌ను పొందడంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చు.

    Details

    చాహల్ ను తీసుకొనే అవకాశం

    విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వస్తే, జట్టులో చాలా మార్పులు జరుగుతాయని, చాహల్‌ను వేలంలో తీసుకునే అంశంలో ఆసక్తి చూపుతారని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు.

    రాజస్థాన్ రాయల్స్ అశ్విన్ కాంబినేషన్‌ కోసం చాహల్‌ను విడిచిపెట్టదని చెప్పారు.

    గత సీజన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాణించకపోయినా, ఆర్సీబీ అతడిని వేలంలో తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చు. మ్యాక్సీ ఫామ్‌లో ఉంటే, అతడిని ఆపడం చాలా కష్టమన్నారు.

    ఈసారి ఐపీఎల్ మెగా వేలం కోసం షార్ట్‌లిస్ట్ జాబితాను ఐపీఎల్ కమిటీ ఇప్పటికే విడుదల చేసింది. ఇందులో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ప్రముఖ భారత ఆటగాళ్లు ఉన్నారు.

    Details

    ఆర్సీబీ ఖాతాలో రూ.41 కోట్లు

    ఆర్సీబీ ఖాతాలో ఇంకా రూ. 41 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం కష్టంగా మారొచ్చు.

    ఇలాంటి తరుణంలో ఆర్సీబీ వ్యూహాత్మకంగా ఎంపికలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, వేలం కోసం పక్కాగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.

    సౌదీ అరేబియాలో జరిగే ఈ మెగా వేలం కోసం భారత క్రికెట్ అభిమానులకు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    విరాట్ కోహ్లీ

    Shivam Dube: కోహ్లీ, యువరాజ్ సరసన చేరిన ఆల్ రౌండర్ శివమ్ దూబే  టీమిండియా
    Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం  బీసీసీఐ
    Virat Kohli: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క  తాజా వార్తలు
    Virat Kohli: టీమిండియా బాడ్ న్యూస్.. చివరి 3 టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం  క్రీడలు

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..? క్రికెట్
    ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్ క్రికెట్
    WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ ఐపీఎల్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025