
IND Vs AUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్ డే లో భారత్ 99 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.
ఈ విజయంతో మెన్ ఇన్ బ్లూ వన్డే వరల్డ్ కప్ 2023 లో అగ్రశ్రేణి ODI జట్టుగా ప్రవేశించనుంది.
మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
అటు తరువాత ఆసీస్ ఇన్నింగ్స్లో 9 ఓవర్ల ఆట పూర్తి అయ్యాక మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 33 ఓవర్లకు కుదించి 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యఛేదనలో ఆసీస్ 217 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బ్యాటర్లో డేవిడ్ వార్నర్(53),సియాన్ అబాట్(54) మాత్రమే రాణించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లక్ష్యఛేదనలో 217 పరుగులకే ఆలౌట్ అయ్యిన ఆసీస్
That's that from the 2nd ODI.
— BCCI (@BCCI) September 24, 2023
Jadeja cleans up Sean Abbott as Australia are all out for 217 runs in in 28.2 overs.#TeamIndia take an unassailable lead of 2-0.#INDvAUS pic.twitter.com/LawVWu2JI8