Page Loader
IND vs BAN: రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్! 
రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20

IND vs BAN: రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ మూడు టీ20ల సిరీస్‌లో ఆఖరి నామమాత్రపు మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌ ఇప్పటికే గెలిచిన నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బెంచ్‌ బలాన్ని పరీక్షించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత తుది జట్టులో ప్రధాన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

వివరాలు 

తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం

సంజూ శాంసన్,అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగనున్నారు. రెండో టీ20లో అభిషేక్ మంచి ఇన్నింగ్స్ ఆడగా, సంజూ పెద్ద ఇన్నింగ్స్ ఆడటానికి సిద్దంగా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు, ఇక హాఫ్ సెంచరీతో మెరిసిన తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా జట్టులో కొనసాగనున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అతని స్థానంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం దక్కనుంది. ఇదే జరిగితే ఉప్పల్ స్టేడియంలో ఇద్దరు తెలుగు ఆటగాళ్లు భారత తరఫున ఆడే వీలుంది.

వివరాలు 

బంగ్లాదేశ్‌తో మూడో టీ20కి భారత తుది జట్టు (అంచనా)

రియాన్ పరాగ్,రింకూ సింగ్ కూడా జట్టులో తమ స్థానాలను కొనసాగించనున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో రవి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు, అతని స్థానంలో హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నాడు. మయాంక్ యాదవ్ జట్టులో కొనసాగనున్నాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా.