NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / India vs New Zealand: వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?
    తదుపరి వార్తా కథనం
    India vs New Zealand: వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?
    వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?

    India vs New Zealand: వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2024
    08:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు కేవలం 107పరుగుల లక్ష్యం.ఇప్పుడు కేవలం ఒక్క రోజే మిగిలి ఉంది.

    సాధారణ పరిస్థితుల్లో, ఇలాంటి పరిమిత లక్ష్యం బ్యాటింగ్ జట్టుకు పెద్ద సవాలు కాకపోవచ్చు.అయితే, బెంగళూరు పిచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌ లో స్పిన్నర్లకు పూర్తిగా సహకారం అందిస్తుంది.

    కాబట్టి,ఈ చిన్నలక్ష్యాన్ని భారత జట్టు కాపాడే అవకాశాలను పూర్తిగా విస్మరించలేం.

    గతంలో ఇలాంటి సందర్భాలలో టీమిండియా విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.

    కానీ ప్రస్తుతానికి, అందరి దృష్టి ఒకటే ప్రశ్న మీద నిలిచింది - ఈ మ్యాచ్‌ కొనసాగుతుందా లేదా?

    శనివారం నాటి నాలుగో రోజు చివరిలో వెలుతురు లేకపోవడంతో ఆట నిలిపివేయబడింది.అప్పుడు భారీ వర్షం కూడా కురిసింది.

    ఈ నేపథ్యంలో,ఇప్పుడు బెంగళూరులో వాతావరణం ఎలా ఉంటుందనేది అందరి ఆసక్తి.

    వివరాలు 

    ఆట షెడ్యూల్‌,వాతావరణ అంచనా 

    షెడ్యూల్‌ ప్రకారం, ఐదో రోజు ఆట ఉదయం 9:15 గంటలకు ప్రారంభం కావాలి. కానీ, వాతావరణ అంచనా ప్రకారం, ఆ సమయంలో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    శనివారం రాత్రి మొదలైన వర్షం మధ్యలో ఆగినా, ఆదివారం సాయంత్రం వరకు అడపాదడపా వర్షం పడుతూనే ఉంటుందని సమాచారం.

    ఈ పరిస్థితి కొనసాగితే,మ్యాచ్‌ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.ఇప్పటి పరిస్థితి చూస్తే,ఆకాశం మేఘావృతమై ఉంది.

    ఉదయం 11 గంటల వరకు వర్షం ఆగినా,మైదానాన్ని సిద్ధం చేయడానికి కనీసం గంట సమయం పడుతుంది.

    మొదటి సెషన్‌ ఆట కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి.మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా వర్షం పడుతుందని అంచనా.

    వివరాలు 

    భారత్ విజయావకాశాలపై అజయ్‌ జడేజా 

    సాయంత్రం 4గంటల నుంచి వర్షం తగ్గుతుందని పేర్కొన్నప్పటికీ,అప్పటికే మైదానం నానిపోయే అవకాశం ఉంది.

    ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌ పూర్తిగారద్దు అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

    ప్రత్యర్థి ఎదుట కేవలం 107పరుగుల టార్గెట్‌ను ఉంచిన టీమిండియా విజయావకాశాలపై మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా స్పందించాడు.

    ''ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటే అది అద్భుతమైన విజయం అవుతుంది.అయితే,సాధారణంగా ఆ లక్ష్యం కాపాడటం అంత సులభం కాదు.ఐదోరోజు ఆట మొదలైనప్పుడు మొదటి సెషన్‌ సీమ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది.కానీ భారత్‌ వద్ద కేవలం ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు.మూడో బౌలర్‌ లేకపోవడం ఓ లోటుగా కనిపిస్తుంది.ఒకటి రెండు వికెట్లు తీయగలిగినా సరిపోదు.స్పిన్నర్లు వచ్చే లోపు పేసర్లు ఎక్కువ పరుగులు ఇవ్వకుండా ఉండాలి''అని జడేజా అభిప్రాయపడ్డాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    క్రికెట్

    ODI Cricket: ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాట్స్‌మెన్‌లపై ఒక లుక్  క్రీడలు
    Samit Dravid: రాహుల్ ద్రావిడ్ అడుగుజాడల్లో కొడుకు.. అండర్-19 జట్టుకు సమిత్ ద్రావిడ్ ఎంపిక  రాహుల్ ద్రావిడ్
    Duleep Trophy: 'పెర్త్' తరహాలో అనంతపురం క్రికెట్ పిచ్ దులీప్ ట్రోఫీ
    Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ'దులీప్ ట్రోఫీ' రంగం సిద్ధం.. షెడ్యూల్ వివరాలు ఇవే దులీప్ ట్రోఫీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025