NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. ఆరోజే ఫలితాలు
    తదుపరి వార్తా కథనం
    జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. ఆరోజే ఫలితాలు
    జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు

    జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. ఆరోజే ఫలితాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 14, 2023
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జులై 6న జరగనున్నాయి. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి మహేష్ మిత్తల్ ధ్రువీకరించారు.

    అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 19గా నిర్ణయించారు.

    ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఈనెల 22 నాటికి ఎన్నికల పరిశీలన పూర్తి కానుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 50 ఓట్లు ఉంటాయి.

    నామినేషన్ల ప్రక్రియ ఈనెల 23న మొదలై.. 25న ముగియనుంది. జూన్ 28 నుంచి జులై 1 మధ్య నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది.

    Details

    ఎన్నికల అధికారిగా మహేష్ మిత్తల్  

    జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మిత్తల్ ను ఐఓఏ సోమవారం డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల అధికారిగా నియమించారు.

    ఈ ఎన్నికల్లో అధ్యక్షుడితో పాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నలుగురు వైస్ ప్రెసిడెంట్లు, కార్యదర్శి, కోశాధికారి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఐదుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు.

    ముఖ్యంగా కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీలను డబ్ల్యూఎఫ్‌ఐ 2022లో రద్దు చేసిన విషయం తెలిసిందే. జులై 6న మెజార్టీని బట్టి పోలింగ్ జరిగిన రోజున విజేతను ప్రకటిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెజ్లింగ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    రెజ్లింగ్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025