NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు
    క్రీడలు

    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు

    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 04, 2023, 10:26 am 1 నిమి చదవండి
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు
    మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా

    భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్‌పై ఐసీసీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదమయే ముగిసిపోవడంతో పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం మూడు డీమెరిట్ పాయింట్లను అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి నివేదిక సమర్పించింది. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ ల అభిప్రాయాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఇండోర్ పిచ్ నాసిరకగా ఉందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్ చేసేందుకు బీసీసీఐకీ 14 రోజులు గడువు ఇవ్వడం గమనార్హం.

    ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేదం పడే అవకాశం

    తొలిరోజు నుంచే స్పిన్నర్లకు సహకారం లభించడంతో తొలి మూడు టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. స్పిన్ అనుకూల పరిస్థితులకు జోడిస్తూ ఇండోర్ ట్రాక్ కూడా అసమాన బౌన్స్‌ను కలిగి ఉండటంతో తొలి రెండు రోజుల్లో 30 వికెట్లు పడిపోయాయి. ఇందులో 26 వికెట్లు స్పిన్నర్లకే పడడం విశేషం. ICC పిచ్, ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రకారం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లను అందజేస్తే అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించకుండా 12 నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. మరోసారి పిచ్‌పై ఇలాంటి సీన్‌ రిపీట్‌ అయితే మాత్రం ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉందని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    క్రికెట్
    ఐసీసీ

    క్రికెట్

    BAN vs ENG: బంగ్లాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్ ఇంగ్లండ్
    PSL: వావ్.. సూపర్ మ్యాన్‌లా బంతిని ఆపిన సికిందర్ రాజా పాకిస్థాన్
    BAN vs ENG: రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన జోస్ బట్లర్ ఇంగ్లండ్
    BAN vs ENG: జాసన్ రాయ్ సూపర్ సెంచరీ ఇంగ్లండ్

    ఐసీసీ

    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం క్రికెట్
    ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య క్రికెట్
    ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా హ్యారీ బ్రూక్ క్రికెట్

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023