NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / MI vs RCB: ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MI vs RCB: ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం
    ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం

    MI vs RCB: ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 07, 2025
    11:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌ సీజన్‌ 18లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    తొలి ఇన్నింగ్స్‌లో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.

    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది.

    వివరాలు 

    ముంబయి జట్టులో మెరిసిన హార్దిక్ పాండ్య,తిలక్ వర్మ

    తిలక్ వర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 56 పరుగులు చేయగా,హార్దిక్ పాండ్య 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42 పరుగులతో చెలరేగిపోయాడు.

    అయితే కీలక సమయంలో ఈ ఇద్దరూ ఔటవడం ముంబయి చివర్లో తడబడింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసినా, వరుసగా వికెట్లు పడుతుండడంతో ముంబై విజయానికి దూరమైంది.

    విల్ జాక్స్ (22 పరుగులు, 18 బంతుల్లో), రోహిత్ శర్మ (17),రికెల్టన్ (17) పరుగులతో కొంత సమయం నిలబడ్డారు.

    ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్య 4 వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చాడు. యశ్ దయాల్, జోష్ హేజల్‌వుడ్ తలో 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఒక్క వికెట్ తీశారు.

    వివరాలు 

    దూకుడుగా ఆడిన కోహ్లీ, పటీదార్ 

    ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ (67 పరుగులు, 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రజత్ పటీదార్ (64 పరుగులు, 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌లు అందించారు.

    దేవ్‌దత్ పడిక్కల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.

    ఆఖరి ఓవర్లలో జితేశ్ శర్మ 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో అజేయంగా 40 పరుగులు చేసి స్కోరు వేగంగా పెంచాడు.

    ముంబయి బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య 2 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీసారు. విఘ్నేశ్ పుతుర్ ఒక్క వికెట్ సాధించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఐపీఎల్

    #NewsBytesExplainer: వేలంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు భారీ ధరలు.. మరి మైదానంలో మెప్పిస్తారా? క్రికెట్
    Rajiv Gandhi International Stadium: ఐపీఎల్‌ 2025కు పటిష్ట బందోబస్తు.. 450 సీసీ కెమెరాలతో నిఘా రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియం
    IPL: ఐపీఎల్ చరిత్రలో సంచలనం సృష్టించిన వివాదాలివే! రాజస్థాన్ రాయల్స్
    Vaibhav Suryavanshi : రంజీ ట్రోఫీ నుంచి ఐపీఎల్‌ వరకు.. సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025