NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL Retention : ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు .. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్
    తదుపరి వార్తా కథనం
    IPL Retention : ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు .. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్
    ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు .. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్

    IPL Retention : ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు .. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2024
    09:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించింది.

    ప్రతి ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించబడింది, వీరిలో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలి.

    రిటెన్షన్ లిస్ట్ సమర్పించడానికి అక్టోబర్ 31 చివరి తేదీగా నిర్ణయించబడింది.

    ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, ఫ్రాంచైజీని వీడతారని వార్తలు వినిపిస్తున్నాయి.

    వివరాలు 

    కెప్టెన్సీలోనూ మార్పు చేయాలని నిర్ణయించిన ఢిల్లీ యాజమాన్యం

    ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు విఫలమైంది. ఈసారి ట్రోఫీని సాధించాలని ఢిల్లీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

    ఇప్పటికే రికీ పాంటింగ్‌ను కోచ్ పదవి నుండి, సౌరవ్ గంగూలీని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ స్థానంలో నుంచి తొలగించారు.

    వీరి స్థానాల్లో హేమాంగ్ బదాని, వేణుగోపాల్ రావులను నియమించారు. అలాగే, కెప్టెన్సీలోనూ మార్పు చేయాలని ఢిల్లీ యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం.

    అయితే కెప్టెన్సీ మార్పు పట్ల రిషబ్ పంత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడని, ఆ బాధ్యతలు తనకే కావాలని డిమాండ్ చేశాడని చెబుతున్నారు.

    ఈ డిమాండ్‌ను డీసీ యాజమాన్యం తిరస్కరించడంతో, పంత్ ఢిల్లీని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

    వివరాలు 

     రిషబ్ పంత్‌ను వేలంలో కొనుగోలు చేయనున్న ఆర్సీబీ

    ఇదిలా ఉండగా, రిషబ్ పంత్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం.

    ఆర్సీబీకి ప్రస్తుతం కొత్త కెప్టెన్, వికెట్ కీపర్ అవసరం ఉంది, ఎందుకంటే దినేష్ కార్తిక్ వీడ్కోలు పలకగా, ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేసే అవకాశాలు లేవు.

    పంత్ రాకతో తమ అదృష్టం మారుతుందని ఆర్సీబీ ఆశిస్తోంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ కూడా పంత్‌ను తమ జట్టుకు కెప్టెన్‌గా తీసుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిషబ్ పంత్
    ఐపీఎల్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రిషబ్ పంత్

    హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం క్రికెట్
    BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు క్రికెట్
    రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది క్రికెట్
    రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..! క్రికెట్

    ఐపీఎల్

    Adam Gilchrist- Hardik Pandya: హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్ ముంబై
    IPL-SRH-RCB-Record Score: ఈ సీజన్ ఐపీఎల్ లో రెచ్చిపోతున్న హైదరాబాద్ జట్టు హైదరాబాద్
    IPL-Maxwell-RCB-Cricket: ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన క్రికెట్
    IPL-Cricket-Buttler: ధోనీ, కోహ్లీని అనుసరించాను: బట్లర్ క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025