Page Loader
Gautam Gambhir Press Conference: రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం.. ధృవీకరించిన గౌతమ్ గంభీర్ 
రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం.. ధృవీకరించిన గౌతమ్ గంభీర్

Gautam Gambhir Press Conference: రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం.. ధృవీకరించిన గౌతమ్ గంభీర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో (AUS vs IND) ఐదు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా తొలి బృందం ఆదివారం అర్ధరాత్రి బయల్దేరింది. ఈ బృందం ఇవాళ మధ్యాహ్నానికి ఆస్ట్రేలియాలో చేరుకొనే అవకాశం ఉంది. రెండో బృందం కూడా మరికాసేపట్లో ప్రయాణం ప్రారంభించనుంది, వారు మంగళవారం ఉదయానికి అక్కడ చేరుకుంటారు. ఈ క్రమంలో భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలివాటిలో కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయం ఇంకా ఖచ్చితంగా నిర్ణయించలేదు. ఆ విషయం నవంబర్ 22 నాటికి స్పష్టమయ్యే అవకాశం ఉంది. రోహిత్ గైర్హాజరైతే, ఓపెనింగ్‌ కోసం కేవలం అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ వంటి ఆప్షన్లు ఉన్నాయని గంభీర్ తెలిపారు.

వివరాలు 

ఓపెనింగ్‌కు అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్

గంభీర్ మాట్లాడుతూ, "కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. ఇది నవంబర్ 22 నాటికి తేలే అవకాశం ఉంది. రోహిత్ లేకుంటే, ఓపెనింగ్‌కు అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ వంటి ఆప్షన్లను మనం ఉపయోగించవచ్చు. శుభ్‌మన్ గిల్‌ను ఓపెనింగ్‌కు పంపించాలా, లేదా? అన్న విషయం పై ఇంకా నిర్ణయించలేదు. అయితే, అద్భుతమైన జట్టుతోనే ఆడతాం."

వివరాలు 

డబ్ల్యూటీసీ ఫైనల్ పై.. 

"ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ గురించి ఆలోచించడం లేదు. ఇప్పటి వరకు మనం ఆడిన ప్రతి మ్యాచ్, సిరీస్‌ కీలకమే. మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాం, అలాగే ఇనుమడిగా కొనసాగుతాం. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లున్నారు, వారందరూ చాలా ప్రతిభావంతులు. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి కీలకపాత్రలు పోషిస్తారని భావిస్తున్నాను. ఆసీస్‌ పిచ్‌లు పేస్‌కు అనుకూలంగా ఉంటాయని తెలుసు.అని గంభీర్ అన్నారు, "

వివరాలు 

సోషల్‌ మీడియా మీద.. 

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు రావడం గురించి గంభీర్ మాట్లాడుతూ, "అలాంటి విమర్శలు నేను పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమాలు కొంత విభేదాన్ని ప్రదర్శిస్తుంటాయి. నేను ఎప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేయను. భారత క్రికెట్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు, వారితో కలిసి పనిచేయడం మా కోచ్‌లకు గౌరవంగా ఉంది" అని అన్నారు.