NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team India: ఇండియాలో డే-నైట్ టెస్టులు నిర్వహించకపోవడానికి కారణం చెప్పిన జైషా
    తదుపరి వార్తా కథనం
    Team India: ఇండియాలో డే-నైట్ టెస్టులు నిర్వహించకపోవడానికి కారణం చెప్పిన జైషా
    ఇండియాలో డే-నైట్ టెస్టులు నిర్వహించకపోవడానికి కారణం చెప్పిన జైషా

    Team India: ఇండియాలో డే-నైట్ టెస్టులు నిర్వహించకపోవడానికి కారణం చెప్పిన జైషా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 15, 2024
    03:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో డే-నైట్ టెస్టు నిర్వహించకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ సెక్రటరీ జే షా వివరించారు.

    భారత్ చివరిసారిగా 2022లో బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో డే-నైట్ టెస్టుకు ఆతిథ్యం ఇచ్చింది.

    అప్పటి నుండి,భారతదేశం ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌లతో టెస్ట్ సిరీస్‌లు ఆడింది.అయితే పింక్ బాల్‌తో మ్యాచ్‌లను నిర్వహించడంలో బిసిసిఐ వెనుకాడుతోంది.

    ఇటీవల,జే షా ఈ చర్య వెనుక ఉన్న కారణాన్ని వివరించారు.అలాంటి మ్యాచ్‌లలో ఫలితాలు త్వరగా వస్తున్నాయని.. దీనివల్ల అభిమానులు, బ్రాడ్‌కాస్టర్లు ఆర్థికంగా నష్టపోతారని.. వారి మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

    టెస్టు మ్యాచ్‌కు వెళ్లే అభిమాని ఐదు రోజులపాటు చూడాలని టికెట్‌ను కొనుగోలు చేస్తే..కేవలం రెండున్నర,మూడు రోజుల్లోనే మ్యాచ్‌ అయ్యిపోతే తీవ్ర నిరాశకు గురవుతాడన్నారు.

    ఇది భావోద్వేగంతో కూడుకున్న వ్యవహారం'' అని జైషా తెలిపారు.

    వివరాలు 

    బంగ్లాదేశ్ ఆఫర్‌ని తిరస్కరించిన జై షా

    మహిళల టీ20 ప్రపంచకప్ 2024కి ఆతిథ్యం ఇవ్వాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించిందని జే షా తెలియజేశారు.

    ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 అక్టోబర్ 3 న ప్రారంభం కానుంది. టోర్నమెంట్ బంగ్లాదేశ్‌లోని రెండు వేదికలలో జరగనుంది.

    మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024కి భారత్‌ ఆతిథ్యం ఇవ్వాలన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అభ్యర్థనను తిరస్కరించినట్లు జే షా వెల్లడించారు.

    రాజకీయ గందరగోళం కారణంగా బంగ్లాదేశ్‌లో చాలా ఉద్రిక్తత ఉంది. అక్కడ ఈవెంట్‌ను నిర్వహించడం బీసీబీకి సవాలుగా ఉంది.

    "వచ్చే ఏడాది 50 ఓవర్ల మహిళల ప్రపంచకప్‌కు మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. వరుస ప్రపంచ కప్‌లను నిర్వహించడం చాలా కష్టం''అని షా అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌ జిన్‌పింగ్
    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క
    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి

    బీసీసీఐ

    బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే? టీమిండియా
    BCCI: బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! క్రికెట్
    బీసీసీకి షాక్ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. మరోసారి షెడ్యూల్‌లో మార్పులకు విజ్ఞప్తి  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
    ఆసియాకప్ 2023కి టీమిండియా ఇదే.. జట్టులోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆసియా కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025