NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Jay Shah: ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత.. రంగంలోకి ఐసీసీ ఛైర్మన్‌ జైషా
    తదుపరి వార్తా కథనం
    Jay Shah: ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత.. రంగంలోకి ఐసీసీ ఛైర్మన్‌ జైషా
    ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత.. రంగంలోకి ఐసీసీ ఛైర్మన్‌ జైషా

    Jay Shah: ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత.. రంగంలోకి ఐసీసీ ఛైర్మన్‌ జైషా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 04, 2024
    11:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025) విషయంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

    బీసీసీఐ (BCCI) ఇప్పటికే ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎట్టకేలకు హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహించేందుకు సిద్ధమైంది.

    అయితే, భారత్‌ పాకిస్థాన్‌ పర్యటనపై అంగీకరించకపోవడంతో, ఐసీసీ (ICC) సూచనల మేరకు పీసీబీ పలు మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

    వివరాలు 

    ఎక్కువ రెవెన్యూ రావాలని పీసీబీ డిమాండ్‌

    కానీ ఈ విషయంలో పాక్‌ బోర్డు ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో ఇకపై జరిగే ఐసీసీ టోర్నీలకు పాకిస్థాన్ జట్టు భారత్‌ పర్యటించకూడదనే నిర్ణయం తీసుకుంటే, ఆ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికలపై నిర్వహించాలని కోరుతోంది.

    అదనంగా, ఈ టోర్నీ ద్వారా తమకు ఎక్కువ రెవెన్యూ రావాలని పీసీబీ డిమాండ్‌ కూడా చేస్తోంది.

    ఇలాంటి పరిణామంలో, ఐసీసీ (ICC) కొత్త చైర్మన్‌గా నియమితులైన జై షా (Jay Shah) ఈ అంశంపై దృష్టి సారించారు.

    గత నెల చివర్లో జరిగిన బోర్డు మీటింగ్‌లో ఐసీసీ, పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకు హైబ్రిడ్‌ మోడల్‌ను అంగీకరించాలని సూచించింది.

    ఈ వ్యవహారంపై స్పష్టత లభించకపోవడంతో, ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదల వాయిదా పడింది.

    వివరాలు 

    యూఏఈ వేదికలలో సెమీస్‌ లేదా ఫైనల్‌

    ఐసీసీ బోర్డు సభ్యులు పాకిస్థాన్‌ పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నప్పటికీ, వారు అంగీకరించాల్సిన హైబ్రిడ్‌ మోడల్‌ను సమర్ధిస్తున్నారు.

    ఒకవేళ భారత్‌ ఈ టోర్నీలో పాల్గొనకపోతే, బ్రాడ్‌కాస్టర్లు కూడా ఐసీసీకి తమ వంతు కమీషన్‌ను చెల్లించలేకపోతారని సూచిస్తున్నారు.

    ఈ విషయాన్ని పాకిస్థాన్‌ కూడా అర్థం చేసుకుంది. ఈ ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించడానికి పాకిస్థాన్‌ సిద్ధంగా ఉండగా, భారత జట్టు యూఏఈలోని వేదికలపై ఆడే అవకాశం ఉంది.

    భారత్‌ సెమీస్‌ లేదా ఫైనల్‌కు చేరుకుంటే, ఆ మ్యాచ్‌లు కూడా యూఏఈ వేదికలలోనే జరగనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    ఐసీసీ

    ICC: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్! ఇంగ్లండ్
    ICC: శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ   శ్రీలంక
    India vs Netherlands: టీమిండియా 9వ విజయం.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు టీమిండియా
    ICC World Cup 2023 : ప్రపంచ కప్ సెమీ పైనల్స్ షెడ్యూల్ ఇదే.. వేదికలు ఎక్కడంటే? వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025