Page Loader
Jithender Reddy: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం నూతన అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి ఎంపిక
తెలంగాణ ఒలింపిక్‌ సంఘం నూతన అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి ఎంపిక

Jithender Reddy: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం నూతన అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి ఎంపిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2024
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) కొత్త అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి. జితేందర్‌రెడ్డి ఎంపికయ్యారు. బుధవారం ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆయన తన ప్రత్యర్థి చాముండేశ్వరినాథ్‌పై 34 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. జితేందర్‌రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండేశ్వరినాథ్‌కు కేవలం 9 ఓట్లు మాత్రమే లభించాయి. కార్యదర్శి పదవికి మల్లారెడ్డి 40 ఓట్లతో బాబూరావుపై (12 ఓట్లు) 28 ఓట్ల తేడాతో గెలుపొందారు. కోశాధికారిగా సతీశ్‌ గౌడ్‌ 40 ఓట్లతో ప్రత్యర్థి ప్రదీప్‌కుమార్‌ (12 ఓట్లు)పై విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా, సంయుక్త కార్యదర్శులుగా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా 15 మంది నామినేషన్లకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.

Details

నాలుగేళ్ల పాటు పదవీకాలం

నూతనంగా ఎన్నికైన కార్యవర్గం నాలుగేళ్ల కాలం పాటు, అంటే 2028 వరకు, తన బాధ్యతలను కొనసాగిస్తుంది. టీఓఏ ఎన్నికలు నవంబరు 21న నిర్వహించినా, ఓట్ల లెక్కింపుపై హైడ్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బాక్సింగ్‌ సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని కోర్టును ఆశ్రయించడంతో ఫలితాల ప్రకటనకు తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే కోర్టు మంగళవారం స్టే ఉత్తర్వులను రద్దు చేయడంతో ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ విజయంతో టీఓఏలో కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.