NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?  
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?  
    ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?

    Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2024
    12:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది.

    బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇప్పటికే పాకిస్థాన్‌లో పర్యటించబోమని స్పష్టంగా తెలిపింది.

    టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే అంశంపై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) ఇప్పటికీ తమ స్పష్టమైన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

    ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతోంది. టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇంకా 75 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది.

    ఈ పరిస్థితిలో టోర్నీకి సంబంధించి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన ప్రసారకర్తలు ఆందోళన చెందుతున్నారు.

    వివరాలు 

    ఛాంపియన్స్‌ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌లో మార్చాలని..

    ఈ నేపథ్యంలో, షెడ్యూల్‌ను త్వరగా విడుదల చేయాలని ఐసీసీ (ICC)పై ఒత్తిడి మరింత పెరుగుతోంది.

    షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అయినా, టోర్నీలో కొన్ని పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

    ఇందులో ముఖ్యంగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో కాకుండా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే అవకాశముందని చెబుతున్నారు.

    బ్రాడ్‌కాస్టర్లు, కొంతమంది వాటాదారులు ఈ ప్రతిపాదనను చర్చలో పెట్టినట్లు సమాచారం.

    ''ప్రతిష్టంభన కొనసాగితే, ఛాంపియన్స్‌ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌లో మార్చాలని కొంతమంది వాటాదారులు కోరే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌గా మార్చడం ద్వారా మార్కెటింగ్‌ను సులభంగా,వేగంగా చేయవచ్చు'' అని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.

    వివరాలు 

    భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగా..

    వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ తన జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికలపై నిర్వహించాలని, హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీని అంగీకరించాలని ఐసీసీకి అభ్యర్థన చేసింది.

    పాకిస్థాన్ కూడా ఈ హైబ్రిడ్‌ మోడల్‌ను అంగీకరిస్తుందని అనుకుంటున్నారు.

    అయితే, పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఇప్పటికే భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో తమ మ్యాచ్‌ల కోసం కూడా ఇదే మోడల్‌ను అనుసరించాలని సూచించిందని తెలిసిందే.

    ఈ అంశంపై ఐసీసీ ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకారం వచ్చినట్లయితే, భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగా జరుగుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    క్రికెట్

    IPL: వేలంలోకి పంత్, రాహుల్, అయ్యర్.. భారీ ధర పలకనున్న స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్
    IPL: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. ఏ జట్లు ఎవరిని నిలుపుకున్నాయో తెలుసా?  ఐపీఎల్
    Wriddhiman Saha: రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్ క్రీడలు
    Ground Staff: పిచ్​ పర్యవేక్షణ బాధ్యతలు,గ్రౌండ్​ను మెయింటెన్ చేసే వారి శాలరీ ఎంతో తెలుసా? క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025