NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత 
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత 
    ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత

    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.

    బీసీసీఐ గతంలో చెప్పినట్లుగా, పాకిస్థాన్‌కు భారత క్రికెట్ జట్టు వెళ్లడం లేదని స్పష్టం చేసింది.

    భద్రతా కారణాల వల్ల, ఐసీసీకి బీసీసీఐ ఈ నిర్ణయం తెలియజేసిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో, ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది, కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దీనికి నిరాకరించిందని తెలుస్తోంది.

    వివరాలు 

    ఐసీసీ సమావేశం వాయిదా? 

    భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ,''బీసీసీఐ ఇప్పటికే తమ నిర్ణయాన్నిప్రకటించింది.అక్కడి భద్రతా పరిస్థితులు అనుకూలంగా లేనట్లుగా భావించి,జట్టును పంపకపోవాలని నిర్ణయించింది.ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని,భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం సాధ్యమయ్యే అవకాశం లేదు''అని పేర్కొన్నారు.

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణకు సంబంధించి ఐసీసీ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది.

    ఈరోజు సాయంత్రం 4గంటలకు సమావేశం జరగాల్సి ఉంది.అయితే,ఆ సమావేశం రేపటికి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం వచ్చింది.

    అధికారికప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించకపోతే,ఆర్థిక పరంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పెద్దనష్టం సంభవించవచ్చు.

    అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం,క్రికెట్ ప్రముఖులు ఈ మోడల్‌కు సహమతం కావడంలో పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విదేశాంగశాఖ

    తాజా

    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం

    విదేశాంగశాఖ

    MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ భారతదేశం
    Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌ ఇస్కాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025