NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / NZ vs BAN: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్‌ ఔట్
    తదుపరి వార్తా కథనం
    NZ vs BAN: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్‌ ఔట్
    బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్‌ ఔట్

    NZ vs BAN: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్‌ ఔట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    08:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా 6వ మ్యాచ్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.

    రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.

    237 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు మిగిలి ఉండగానే చేధించి, 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.

    ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర (112) సెంచరీతో ఆకట్టుకున్నాడు.105 బంతుల్లో 12 ఫోర్లు,ఒక సిక్సర్ బాదాడు.

    న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో టామ్ లాథమ్ (55),డెవిన్ కాన్వే (30),గ్లేన్ ఫిలిప్స్ (21*), మిచెల్ బ్రేస్ వెల్ (11*) కూడా ప్రభావం చూపించారు.

    బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగంలో టస్కిన్ అహ్మద్, నహీద్ రానా, ముస్తఫిజుర్ రహమాన్, రిషాద్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.

    వివరాలు 

    సెమీఫైనల్‌కు.. భారత్, న్యూజిలాండ్ 

    అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్,నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది.

    బంగ్లా జట్టు తరఫున కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (77) ఒంటరి పోరాటం చేశాడు.అతనికి తోడుగా జాకీర్ అలీ (45) ఆకట్టుకున్నాడు.

    రిషాద్ హుస్సేన్ (26),తంజీద్ హసన్ (24),మెహిదీ హసన్ మిరాజ్ (13 కూడా కొంతవరకు సహాయపడ్డారు.

    న్యూజిలాండ్ బౌలింగ్‌లో మిచెల్ బ్రేస్ వెల్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.విల్ ఓ'రూర్కే 2 వికెట్లు తీయగా,హెన్రీ, జేమీసన్ తలో వికెట్ సాధించారు.

    ఈ విజయంతో న్యూజిలాండ్ వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచింది.

    ఇక బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది.దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛాంపియన్స్ ట్రోఫీ

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    ఛాంపియన్స్ ట్రోఫీ

    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ టీమిండియా
    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం క్రీడలు
    Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ  రోహిత్ శర్మ
    Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..! క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025