NZ vs BAN: బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్ ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా 6వ మ్యాచ్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.
రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.
237 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు మిగిలి ఉండగానే చేధించి, 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర (112) సెంచరీతో ఆకట్టుకున్నాడు.105 బంతుల్లో 12 ఫోర్లు,ఒక సిక్సర్ బాదాడు.
న్యూజిలాండ్ బ్యాటింగ్లో టామ్ లాథమ్ (55),డెవిన్ కాన్వే (30),గ్లేన్ ఫిలిప్స్ (21*), మిచెల్ బ్రేస్ వెల్ (11*) కూడా ప్రభావం చూపించారు.
బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగంలో టస్కిన్ అహ్మద్, నహీద్ రానా, ముస్తఫిజుర్ రహమాన్, రిషాద్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.
వివరాలు
సెమీఫైనల్కు.. భారత్, న్యూజిలాండ్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్,నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది.
బంగ్లా జట్టు తరఫున కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (77) ఒంటరి పోరాటం చేశాడు.అతనికి తోడుగా జాకీర్ అలీ (45) ఆకట్టుకున్నాడు.
రిషాద్ హుస్సేన్ (26),తంజీద్ హసన్ (24),మెహిదీ హసన్ మిరాజ్ (13 కూడా కొంతవరకు సహాయపడ్డారు.
న్యూజిలాండ్ బౌలింగ్లో మిచెల్ బ్రేస్ వెల్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.విల్ ఓ'రూర్కే 2 వికెట్లు తీయగా,హెన్రీ, జేమీసన్ తలో వికెట్ సాధించారు.
ఈ విజయంతో న్యూజిలాండ్ వరుసగా రెండు మ్యాచ్లను గెలిచింది.
ఇక బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది.దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి.