NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy: ఒకసారి ICC చైర్మన్ గా జేషా బాధ్యతలు స్వీకరిస్తే..: ఛాంపియన్స్ ట్రోఫీ డెడ్‌లాక్‌పై పీసీబీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy: ఒకసారి ICC చైర్మన్ గా జేషా బాధ్యతలు స్వీకరిస్తే..: ఛాంపియన్స్ ట్రోఫీ డెడ్‌లాక్‌పై పీసీబీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
    ఛాంపియన్స్ ట్రోఫీ డెడ్‌లాక్‌పై పీసీబీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

    Champions Trophy: ఒకసారి ICC చైర్మన్ గా జేషా బాధ్యతలు స్వీకరిస్తే..: ఛాంపియన్స్ ట్రోఫీ డెడ్‌లాక్‌పై పీసీబీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డిసెంబర్ 1న భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జైషా (Jay Shah) ఐసీసీ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

    ఇక, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఐసీసీ పాక్‌కు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.

    శుక్రవారం జరగనున్న సమావేశంలో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    తాజా సమాచారం ప్రకారం,హైబ్రిడ్‌ మోడల్‌ కాకుండా టోర్నీ మొత్తాన్ని పాక్‌ నుంచి తీసేసేందుకు ఐసీసీ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    కాగా, పీసీబీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రోఫీ నిర్వహణను వదులుకొనేదే లేదని స్పష్టంగా చెప్పింది.

    వివరాలు 

    మా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము నిర్ణయాలు తీసుకుంటాం: మోసిన్ నక్వీ

    ఈ క్రమంలో, కొత్త ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించిన తరువాత పాకిస్థాన్‌లో టోర్నీ నిర్వహణకు ఆసక్తి తగ్గిపోతుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    అయితే, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నక్వీ విభిన్నంగా స్పందించారు.

    ఆయన మాట్లాడుతూ,''పాకిస్థాన్‌ నుండి అద్భుతమైన ఆతిథ్యం అందించడానికి మేము సిద్ధం ఉన్నాము. కానీ, భారత జట్టు మా దేశానికి రావడానికి సిద్ధంగా లేదు.అలాగే, మేము కూడా భారత్‌కు వెళ్లే ఆలోచన ఏమి చేయడం లేదు. రేపు జరిగే సమావేశంలో టోర్నీ అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు. అయినప్పటికీ, మా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము నిర్ణయాలు తీసుకుంటాం. డిసెంబర్ 1 నుంచి జైషా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు.కనుక,ఐసీసీ ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకుంటూ జైషా వ్యవహరించాల్సి ఉంటుంది''అన్నారు.

    వివరాలు 

    పాక్‌ పై మరింత ఒత్తిడి

    ఇటీవల, పాక్ క్రికెట్ బోర్డు భారత జట్టుకు సంబంధించి తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, ''వారు ఇక్కడ రాకపోవడం ఆమోదయోగ్యం కాదు. సమానత్వం ఉండాలి'' అని చెప్పారు.

    ఇదిలా ఉంటే, పాక్‌ కి ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ, శ్రీలంక కూడా తమ పర్యటనను విరమించుకోవడం, తద్వారా పాక్‌ పై మరింత ఒత్తిడి పెరిగింది.

    దీంతో, ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్పు జరిగే అవకాశాలు పెరిగాయని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా
    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు

    పాకిస్థాన్

    Babar Azam: కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న బాబర్ ఆజమ్ బాబార్ అజామ్
    Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌లో అలజడి.. ఆటగాళ్లకు కనీసం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బోర్డు క్రీడలు
    Pakistan: కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం చైనా
    Pakistan shooting: పాకిస్థాన్‌లో దారుణం.. సాయుధుడి కాల్పులలో  20 మంది మృతి..  ఏడుగురికి గాయాలు  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025