Page Loader
Vinesh Phogat: ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందంతో ముచ్చటించిన ప్రధాని.. వినేష్'వీర పుత్రిక' అన్న మోదీ    
వినేష్'వీర పుత్రిక' అన్న మోదీ

Vinesh Phogat: ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందంతో ముచ్చటించిన ప్రధాని.. వినేష్'వీర పుత్రిక' అన్న మోదీ    

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 16, 2024
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించినా పతకం సాధించలేకపోయింది. దీనిపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులను స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి, రెజ్లింగ్‌ ఫైనల్‌ నుంచి అనూహ్యంగా అనర్హతకు గురైన వినేశ్‌ ఫొగాట్‌ ను ప్రధాని కొనియాడారు. ఆమెను 'వీర పుత్రిక' అని అభివర్ణించారు. ఈ కార్యక్రమం హైలైట్స్‌ను తాజాగా మోదీ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.

వివరాలు 

ఆటగాళ్ల  ఆటతీరుపై దేశం గర్వంగా ఉంది: మోదీ 

ఆగస్టు 15న పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి తిరిగి వచ్చిన ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్నందుకు క్రీడాబృందాన్ని ప్రధాని అభినందించారు. ఆటగాళ్లందరు తమవంతు ప్రయత్నం చేశారన్నారు. ఒలింపిక్స్ లో ఏదో ఒకటి నేర్చుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చారన్నారు. వారి ఆటతీరుపై ఈ దేశం గర్వంగా ఉందన్నారు. వారితో ముచ్చటించిన దృశ్యాలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వినేష్ ఫోగట్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఒలింపిక్ రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయురాలు (మహిళ) వినేష్ అని ప్రధాని మోదీ అన్నారు. ఇది మాకు గర్వకారణం.

వివరాలు 

వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు

వినేష్ ఫోగట్ ప్రస్తుతం ప్యారిస్‌లో ఉన్నారు. ఆమె శనివారం భారత్‌కు తిరిగి రానున్నారు. వినేష్ ఫోగట్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరి రికార్డు సృష్టించింది. అయితే, ఫైనల్‌కు మరుసటి రోజు, ఆమె బరువు 50 కిలోల కంటే 100 గ్రాములు అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో వినేష్ ఫోగట్‌కు పతకం దక్కలేదు.