Page Loader
National Games: డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో 38వ నేషనల్‌ గేమ్స్‌ ని ప్రారంభించిన ప్రధాని మోదీ
38వ నేషనల్‌ గేమ్స్‌ ని ప్రారంభించిన ప్రధాని మోదీ

National Games: డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో 38వ నేషనల్‌ గేమ్స్‌ ని ప్రారంభించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
07:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ వైభవోత్సవానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. ఉత్తరాఖండ్‌ తొలిసారి నేషనల్ గేమ్స్‌ను నిర్వహిస్తున్న ఈ సందర్భంలో, ఫిబ్రవరి 14 వరకు ఈ క్రీడలు కొనసాగుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 10 వేల మంది క్రీడాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనవరి 28, మంగళవారం, 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గ్రీన్ గేమ్స్ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, గేమ్స్ విలేజ్ బయట 10 వేల మొక్కలను క్రీడాకారులు నాటారు.మొత్తం 35 విభాగాల్లో పోటీలు జరుగుతాయి.

వివరాలు 

తొలిసారిగా నేషనల్ గేమ్స్‌లో యోగా పోటీలు

ఈసారి తొలిసారిగా నేషనల్ గేమ్స్‌లో యోగా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భారత్ 2036 నాటికి ఒలింపిక్స్‌ను నిర్వహించడంపై దృష్టి పెట్టిందని తెలిపారు. 28 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన రథంపై రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి,కేంద్ర క్రీడల శాఖ సహాయమంత్రి రక్షా ఖడ్సే, అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి, పీటీ ఉష తదితర ప్రముఖులు వేదికపై హాజరయ్యారు. ముఖ్యమంత్రి ధామి ప్రధానికి పుష్పగుచ్ఛం, టోపీ, శాలువా, అంగవస్త్రం అందజేశారు.

వివరాలు 

43 క్రీడా విభాగాల్లో 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు

అదనంగా, ప్రధాని మోదీ క్రీడాకారులు లక్ష్యసేన్, మనీష్ రావత్, జస్పాల్ రాణా, సురేంద్ర కన్వాసి, హంసా మన్రాల్, హితేంద్ర రావత్, సుభాష్ రాణా, మనోజ్ సర్కార్‌లను కూడా కలిశారు. క్రీడల ప్రారంభోత్సవం కళాకారుల విన్యాసాలతో కన్నుల పండుగగా మారింది. 43 క్రీడా విభాగాల్లో 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇందులో 49% మహిళా అథ్లెట్లు ఉన్నారు. రాష్ట్ర జట్లతో పాటు ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, సర్వీసెస్ జట్లు కూడా పాల్గొంటాయి. గత నాలుగు ఎడిషన్లలో సర్వీసెస్ జట్టు విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగనున్న ఈ నేషనల్ గేమ్స్, దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను వెలికితీసేందుకు ఉత్తమ వేదికగా నిలుస్తుంది.