NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / I.M. Vijayan: భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    I.M. Vijayan: భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం
    భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం

    I.M. Vijayan: భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 30, 2025
    09:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ఫుట్‌ బాల్ మాజీ కెప్టెన్ ఐ ఎం విజయన్ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

    దేశంలోని నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న విజయన్, ఈ గౌరవాన్ని భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు అంకితమిచ్చారు.

    విజయన్ పద్మశ్రీ అవార్డును అందుకున్న తొమ్మిదవ భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నిలిచాడు.

    ఆయన కంటే ముందు గోస్తో పాల్, శైలెన్ మన్నా, చునీ గోస్వామి, పీకే బెనర్జీ, భైచుంగ్ భుటియా, సునిల్ ఛేత్రీ, బెంబెమ్ దేవి, బ్రహ్మానంద్ సంక్‌వాల్కర్ ఈ గౌరవాన్ని అందుకున్నారు.

    ఈ అవార్డును దేశంలోని ప్రతి ఫుట్‌బాల్ అభిమానులకు అంకితం చేస్తున్నానని, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్లే కారణమని విజయన్ తెలిపాడు.

    Details

    కష్టాలను అధిగమించి దేశ గౌరవాన్ని అందకున్న విజయన్

    విజయన్ కేరళలోని త్రిస్సూర్ జిల్లా, తిరుర్‌లో జన్మించాడు. అతను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ అంటే అతనికి ప్రగాఢమైన ఆసక్తి ఉండేది.

    విజయన్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేశాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్నతనంలోనే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    తాను చిన్న వయస్సులోనే త్రిస్సూర్‌లోని ఫుట్‌బాల్ గ్రౌండ్స్ వద్ద చాయ్ (టీ) అమ్ముతూ జీవనం సాగించేవాడు.

    అయితే, అతని అసలు కల ఫుట్‌బాల్ ఆడటం కావడంతో, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ఆటను మెరుగుపర్చుకున్నాడు.

    అతని ఫుట్‌బాల్ నైపుణ్యాలను గుర్తించిన కేరళ పోలీస్ ఫుట్‌బాల్ జట్టు విజయన్‌ను తమ జట్టులోకి తీసుకుంది.

    Details

    పాకిస్థాన్ పై 12 నిమిషాల్లోనే హ్యాట్రిక్ గోల్స్

    భారత జాతీయ జట్టుకు 88 సార్లు ప్రాతినిధ్యం వహించిన విజయన్, 39 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు.

    1991 జనవరిలో తిరువనంతపురంలో నెహ్రూ కప్‌లో రొమేనియాతో మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులోకి వచ్చిన విజయన్ వచ్చాడు.

    12 సంవత్సరాల పాటు భారత జట్టులో కొనసాగాడు. 2003 అక్టోబర్‌లో హైదరాబాద్లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ ఫైనల్ తర్వాత ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పిన అతను భారత ఫుట్‌బాల్‌లో అత్యంత ఆదరణ పొందిన క్రీడాకారుడిగా మారాడు. 1

    999 SAF గేమ్స్‌లో పాకిస్తాన్‌పై కేవలం 12 నిమిషాల్లో అత్యంత వేగవంతమైన అంతర్జాతీయ హ్యాట్రిక్ సాధించిన ఘనత అతనికి దక్కింది.

    Details

    ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డుకు మూడుసార్లు ఎంపిక

    1993, 1997, 1999 సంవత్సరాల్లో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డును మూడు సార్లు అందుకున్నాడు.

    ఇది భారత ఫుట్‌బాల్‌లో ఒక గొప్ప ఘనత. విజయన్ తన ఫుట్‌బాల్ జీవితం మొత్తం 2003 వరకు కొనసాగించగా, జాతీయ స్థాయిలో కూడా అనేక విజయాలను అందుకున్నాడు.

    క్లబ్ స్థాయిలో ఎఫ్‌సి కోచి, జెసిబి, మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, జపాన్ క్లబ్లు వంటి ప్రముఖ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫుట్ బాల్
    పద్మశ్రీ పురస్కారాలు

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    ఫుట్ బాల్

    కైలియన్ ఎంబాపే కీలక నిర్ణయం.. 2024 తర్వాత పీఎస్‌జీని వదిలే అవకాశం! ప్రపంచం
    భారత ఆటగాడు సునీల్ ఛెత్రి అరుదైన ఘనత ప్రపంచం
    రెండోసారి ఇంటర్ కాంటినెంటల్‌కప్ ఛాంపియన్‌గా భారత్.. ఓడిశా నగదు బహుమానం క్రీడలు
    మరో అరుదైన ఘనతను చేరుకోనున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో క్రిస్టియానో రొనాల్డ్

    పద్మశ్రీ పురస్కారాలు

    padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు పద్మవిభూషణ్
    Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం పద్మవిభూషణ్
    Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి  తెలంగాణ
    Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025