NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు
    మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు

    PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు పేలవ ఫామ్‌ కొనసాగుతూనే ఉంది.తాజాగా జరిగిన మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఆమె మొదటి రౌండ్‌లోనే ఇంటికెళ్లాల్సి వచ్చింది.

    బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు 11-21,21-14,15-21 స్కోర్లతో వియత్నాం ఆటగాళి లిన్‌ నుయెన్‌ చేతిలో ఓటమి పాలైంది.

    ఇతర భారత మహిళా షట్లర్ల పరిస్థితి కూడా ఇదే తరహాలో నిరాశాజనకంగా ఉంది.

    మాళవిక బాన్సోద్‌ 21-19,18-21, 8-21తో చైనీస్‌ తైపీకి చెందిన పిన్‌ చియాన్‌ చేతిలో ఓడిపోయింది.

    ఆకర్షి కశ్యప్‌ 9-21, 8-21స్కోర్లతో ఇండోనేసియాకు చెందిన పుత్రి కుసుమ వర్దని చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

    ఉన్నతి హుడా కూడా 12-21,20-22తో చైనీస్‌ తైపీకి చెందిన లిన్‌ సియాంగ్‌ చేతిలో ఓటమిని మూటగట్టుకుంది.

    వివరాలు 

    చైనా షట్లర్‌ గ్వాంగ్‌ జుపై విజయం సాధించిన కిదాంబి శ్రీకాంత్‌

    అయితే పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు.

    హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ మొదటి రౌండ్‌లో జపాన్‌కి చెందిన కెంటా నిషిమోటోపై 19-21, 21-17, 21-16తో గెలుపొందాడు.

    కిదాంబి శ్రీకాంత్‌ 23-21, 13-21, 21-11తో చైనా షట్లర్‌ గ్వాంగ్‌ జుపై విజయం సాధించాడు.

    మరోవైపు కరుణాకరన్‌ 21-13, 21-14తో మూడో సీడ్‌ అయిన చైనీస్‌ తైపీకి చెందిన తీన్‌ చెన్‌ను ఓడించాడు.

    ఆయుష్‌ శెట్టి కెనడాకు చెందిన బ్రయాన్‌ యాంగ్‌ను 20-22, 21-10, 21-8తో ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు.

    ప్రియాన్షు రజావత్‌ మాత్రం తొలి రౌండ్‌లోనే పరాజయం చెందాడు. అతను సింగపూర్‌కి చెందిన హెంగ్‌ జేసన్‌ చేతిలో 15-21, 17-21తో ఓటమి పాలయ్యాడు.

    వివరాలు 

    మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో అదరగొట్టిన ధ్రువ్‌ కపిల, తనీషా క్రాస్టో జోడీ

    మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ధ్రువ్‌ కపిల, తనీషా క్రాస్టో జోడీ అదరగొట్టింది.

    ఈ జంట ఇండోనేసియాకు చెందిన అద్నాన్‌ మౌలానా - ఇదా జమీల్‌ జంటను 21-18, 15-21, 21-14తో ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

    అదే విభాగంలో రోహన్‌ కపూర్‌ - గద్దె రుత్విక శివాని జంట మాత్రం 10-21, 14-21తో చైనా జంట షిన్‌ గువో - చెన్‌ ఫాంగ్‌ చేతిలో ఓటమి చవిచూసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పివి.సింధు

    తాజా

    PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు పివి.సింధు
    Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ..  రానా దగ్గుబాటి
    OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ  ఓపెన్ఏఐ
    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ

    పివి.సింధు

    ఆసియా బ్యాడ్మింటన్‌లో పీవీ.సింధు, శ్రీకాంత్‌పై భారీ అంచనాలు బ్యాడ్మింటన్
    క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన సింధు, ప్రణయ్ బ్యాడ్మింటన్
    మలేషియా మాస్టర్స్ 2023 : నిరాశ పరిచిన శ్రీకాంత్.. సెమీఫైనల్ కు సింధు, ప్రణయ్ టెన్నిస్
    సింధు టాలెంట్‌కు అసలు పరీక్ష.. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ టెన్నిస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025