Page Loader
IND vs NZ: భారత్ 462 పరుగులకు ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
భారత్ 462 పరుగులకు ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

IND vs NZ: భారత్ 462 పరుగులకు ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులకు అల్ ఔట్ అయ్యి, కివీస్‌కు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం న్యూజిలాండ్‌ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగింది. కానీ, తొలి ఓవర్‌లో నాలుగు బంతులు పడిన తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లకు చేరుకోగా, మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. కాసేపటికే అంపైర్లు నాలుగో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంకా పరుగులేమీ చేయలేదు.

వివరాలు 

రిషభ్ పంత్ సెంచరీ మిస్ 

భారత రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌(150; 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్‌లు)భారీ శతకం బాదగా, రిషభ్ పంత్ (99; 105 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీని మిస్ చేశాడు. విరాట్ కోహ్లీ(70),రోహిత్‌ శర్మ(52),జైశ్వాల్‌(32)కూడా ఆకట్టుకున్నారు.కేఎల్ రాహుల్(12),రవీంద్ర జడేజా (5),అశ్విన్ (15)నిరాశపర్చారు. ఒక దశలో 400/3తో బలమైన స్థితిలో ఉన్న భారత్‌ కొత్త బంతి వచ్చిన తర్వాత వేగంగా వికెట్లు కోల్పోయింది. కొత్త బంతితో టీమ్‌ఇండియా 62పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3,విలియం 3,అజాజ్ పటేల్ 2,టిమ్ సౌథీ,గ్లెన్ ఫిలిప్స్‌లు తలో వికెట్‌ తీసుకున్నారు. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట కాగా,కివీస్ 402 పరుగులు చేసింది.