Page Loader
Rajasthan Royals: ఫిక్సింగ్‌ వ్యాఖ్యలపై రాజస్థాన్‌ రాయల్స్‌ ఫైర్‌..బిహానీపై తీవ్ర అభ్యంతరం!
ఫిక్సింగ్‌ వ్యాఖ్యలపై రాజస్థాన్‌ రాయల్స్‌ ఫైర్‌..బిహానీపై తీవ్ర అభ్యంతరం!

Rajasthan Royals: ఫిక్సింగ్‌ వ్యాఖ్యలపై రాజస్థాన్‌ రాయల్స్‌ ఫైర్‌..బిహానీపై తీవ్ర అభ్యంతరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఏప్రిల్‌ 19న లక్నో సూపర్‌జెయింట్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయం నేపథ్యంగా రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (RCA) తాత్కాలిక అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ జయదీప్‌ బిహానీ సంచలన ఆరోపణలు చేశారు. మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందని ఆయన గంభీరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం చుట్టుముట్టింది. ఫిక్సింగ్‌ ఆరోపణలపై రాజస్థాన్‌ రాయల్స్‌ ఆగ్రహం జయదీప్‌ బిహానీ చేసిన ఆరోపణలను రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం ఖండించింది. బిహానీ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ, ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా శాఖ కార్యదర్శికి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారిక ఫిర్యాదు కూడా చేసింది.

Details

జట్టు ప్రదర్శనపై సందేహాలు

రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌కు చెందిన సీనియర్‌ అధికారి దీప్‌ రాయ్‌ మాట్లాడుతూ బిహానీ చేసినవి అసత్య ఆరోపణలు. అవి క్రికెట్‌కు హానికరమని ఖండించారు. జయదీప్‌ బిహానీ మాత్రం మరో కోణాన్ని బయటపెట్టారు. రాజస్థాన్‌ రాయల్స్‌, రాజస్థాన్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, బీసీసీఐ కలిసి తాత్కాలిక అడ్‌హక్‌ కమిటీని ఐపీఎల్‌కు సంబంధిత కార్యకలాపాల నుంచి పక్కన పెట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. జట్టు ప్రదర్శనపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఆరోపణలపై రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. బిహానీ చేసిన ఆరోపణలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాం.

Details

 ఐపీఎల్‌ మ్యాచ్‌లపై అధికార హక్కు ఎవరిది? 

ఈ విధమైన బహిరంగ వ్యాఖ్యలు రాజస్థాన్‌ రాయల్స్‌తో పాటు, రాయల్ మల్టీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RMPL), రాజస్థాన్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, బీసీసీఐ పరువు, విశ్వసనీయతను దెబ్బతీశాయి. క్రికెట్‌ సమగ్రతకూ నష్టం కలిగించాయని యాజమాన్యం తెలిపింది. బీసీసీఐ ప్రస్తుత విధానాల ప్రకారం, 2025 సీజన్‌ కోసం జైపుర్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ అధికార హక్కులు రాజస్థాన్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌కు ఉన్నాయి. వారు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో బీసీసీఐతో సమన్వయంగా పని చేస్తున్నారని రాజస్థాన్‌ రాయల్స్‌ స్పష్టం చేసింది.

Details

అక్రిడిటేషన్‌ కార్డులు కూడా ఇవ్వలేదు: బిహానీ విమర్శ 

జైపుర్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల నుంచి తాత్కాలిక కమిటీని వెనక్కి నెట్టడం కుట్రేనని బిహానీ ఆరోపించారు. గతంలో RCA అంతర్జాతీయ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నియమించిన తాత్కాలిక కమిటీని పక్కన పెడుతున్నారు. రాజస్థాన్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ క్రీడా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈవెంట్‌ సభ్యులకు కనీసం అక్రిడిటేషన్‌ కార్డులు కూడా ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తంగా ఓ సాధారణ క్రికెట్‌ మ్యాచ్‌ ఓటమి తీవ్ర రాజకీయ, పరస్పర ఆరోపణల మౌడ్‌కు దారి తీస్తున్న తీరు ప్రస్తుతం రాజస్థాన్‌లో చర్చనీయాంశంగా మారింది.