NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా
    బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 07, 2025
    11:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్సీబీ విజయోత్సవాల వేళ జరిగిన బెంగళూరు తొక్కిసలాటపై దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

    11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటన నేపథ్యంలో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు.

    తాజాగా ఈ ఘటనపై నైతిక బాధ్యత తీసుకుంటూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (KSCA) కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఇ.ఎస్‌. జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు.

    ఈ మేరకు శనివారం వారు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. రెండు మూడు రోజుల్లో అనూహ్యమైన ఘటనలు జరిగాయి. వాటిలో మా పాత్ర పరిమితంగానే ఉంది.

    Details

    ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టు

    నైతికంగా బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేస్తున్నాం. మా రాజీనామా లేఖలను కేఎస్‌సీఏ అధ్యక్షుడికి పంపామని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.

    ఆర్సీబీ యాజమాన్యం, కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్‌ భట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌ నిఖిల్ సొసలె, డీఎన్ఏ సంస్థకు చెందిన సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్‌లను అరెస్టు చేశారు.

    Details

    ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ సంఘం

    మరోవైపు ఈ కేసు కోర్టు చుట్టూ తిరుగుతోంది. తమపై నమోదైన కేసు రద్దు చేయాలంటూ కర్ణాటక క్రికెట్ సంఘం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

    పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం తమపై బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోరింది. దీనిపై స్పందించిన కోర్టు.. తదుపరి విచారణను జూన్‌ 13కు వాయిదా వేసింది.

    ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బెంగళూరు నగర కమిషనర్‌ బి.దయానంద్‌ సస్పెండ్‌ అయ్యారు. అలాగే సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిను కూడా ప్రభుత్వ సేవల నుంచి తొలగించారు.

    మరికొందరు అధికారులను బదిలీ చేస్తూ చర్యలు కొనసాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తాజా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర బంగారం
    Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ' రవితేజ
    Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం ఛత్తీస్‌గఢ్

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    RCB vs SRH: హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ; 186 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్  ఐపీఎల్
    RCB vs SRH: సెంచరీతో అదరగొట్టన కోహ్లీ; ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ విజయం ఐపీఎల్
    IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే  ఐపీఎల్
    Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్  ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025