
Shreyas Iyer: కోచ్ రికీపాంటింగ్ మైదానంలో నాకు చాలా మద్దతు ఇచ్చాడు: శ్రేయస్ అయ్యర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 స్థానాన్నిఅందుకుని ముందంజ వేసింది.
2014 తర్వాత పంజాబ్ జట్టు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడాడు. ముఖ్యంగా తనకు కోచ్ రికీ పాంటింగ్ అందిస్తున్న సహాయ సహకారాన్ని గురించి వివరించాడు.
''రికీ పాంటింగ్తో నాకు చాలా కాలంగా స్నేహం ఉంది. అతను మైదానంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో నన్ను పూర్తిగా స్వేచ్ఛతో వదిలేస్తాడు. ఆ విశ్వాసమే మాకు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తోంది,'' అని శ్రేయస్ అన్నాడు.
వివరాలు
ప్రియాంశ్ ఆర్య, జోస్ ఇంగ్లిస్ పై ప్రశంసలు
పంజాబ్ విజయంలో కీలకంగా నిలిచిన బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య, జోస్ ఇంగ్లిస్ల ప్రదర్శనపై కూడా ఆయన ప్రశంసలు కురిపించాడు.
''ప్రియాంశ్ ఆర్య అద్భుతంగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. యువ ఆటగాళ్లు ధైర్యంగా ఆడుతున్నారు. నెట్స్లో ఎంతగానో శ్రమించి ఇప్పుడు ఆ కృషిని మైదానంలో చూపిస్తున్నారు. జోస్ ఇంగ్లిస్ విషయానికొస్తే, అతను తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుంటూ ఇనింగ్స్కు వస్తున్నాడు. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతాడు. అతను ఎక్కువ బంతులు ఆడితే మాకు మరింత మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇంగ్లిస్ ఓ విధ్వంసకరమైన బ్యాటర్ అనే విషయం మనందరికీ తెలిసిందే,'' అని శ్రేయస్ అయ్యర్ వివరించాడు.