
RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల దీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టి తొలి టైటిల్ను సాధించి కలను నిజం చేసుకుంది.
పంజాబ్ కింగ్స్తో జరిగిన హోరాహోరీ ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.
Details
అద్భుతంగా పోరాడిన శశాంక్ సింగ్
పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్ అద్భుతంగా పోరాడాడు. అతను 30 బంతుల్లో అజేయంగా 61 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసినా, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.
ఇతర బ్యాటర్లు జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ 26, ప్రియాంశ్ ఆర్య 24, నేహల్ వధేరా 15 పరుగులు చేశారు.
ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్య తలో రెండు వికెట్లు తీసారు.
హేజిల్వుడ్, రొమారియో షెఫర్డ్, యశ్ దయాల్ ఒక్కొక్క వికెట్ అందుకున్నారు. ఈ విజయంతో ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్డాది, అభిమానుల ఆశల్ని నెరవేర్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 𝐎𝐅 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟓 🏆🤩
— IndianPremierLeague (@IPL) June 3, 2025
The ROYAL CHALLENGERS BENGALURU have done it for the first time ❤#RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets pic.twitter.com/x4rGdcNavS