NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి
    తదుపరి వార్తా కథనం
    ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి
    SA మహిళల చేతిలో ఓడిపోయిన భారత్ మహిళలు

    ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 03, 2023
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌతాఫ్రికా మహిళలతో జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో టీమిండియా మహిళలు దారుణంగా విఫలమయ్యారు. లీగ్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు పేలవ ప్రదర్శనతో ఫైనల్లో చతికిలపడ్డాడరు. ఫలితంగా ముక్కోణపు టోర్నీలో సౌతాఫ్రికా మహిళలు విజేతగా నిలిచారు.

    గురువారం జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులను మాత్రమే చేశారు.

    ఎనిమిది బంతులాడి స్మృతి మంధాన (0) డకౌట్‌ కాగా, మరో ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (11) బ్యాటింగ్ లో విఫలమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ 48 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

    ట్రయాన్

    32 బంతుల్లో 57 పరుగులు చేసిన ట్రయాన్

    SA బౌలర్లు మెరుగ్గా రాణించడంతో భారత్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. నాంకులులేకో మ్లాబా 2/16, కెప్టెన్ సునే లూస్ 1/22తో రాణించింది.

    హర్లీన్ 56 బంతుల్లో నాలుగు ఫోర్లతో 46 పరుగులు చేసింది. ఆమె ప్రస్తుతం 17.50 సగటుతో 245 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 22 బంతుల్లో రెండు ఫోర్లతో 21 పరుగులు చేసింది. దీప్తి శర్మ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

    దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రయాన్ 32 బంతుల్లో 57* పరుగులు సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 20.80 సగటుతో 957 పరుగులు చేసింది. అనంతరం ఆమెకు ప్లేయర్ ఆప్ ధ మ్యాచ్ గా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉమెన్ టీ20 సిరీస్
    క్రికెట్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఉమెన్ టీ20 సిరీస్

    8వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం క్రికెట్

    క్రికెట్

    బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ పింఛ్ అద్భుత ఘనత ఆస్ట్రేలియా
    మహ్మద్ సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ బౌలర్ టీమిండియా
    సూపర్ ఫామ్‌లో రవీంద్ర జడేజా జడేజా
    న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సై టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025