NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన భారత్
    తదుపరి వార్తా కథనం
    IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన భారత్
    న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన భారత్

    IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన భారత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 23, 2024
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

    ఈ సందర్భంగా టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు పుణె వేదికగా జరగబోయే రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని కృతనిశ్చయంగా ఉంది.

    రెండో టెస్టు అక్టోబర్ 24న ప్రారంభమవ్వనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్‌పై భారత్ జట్టు తక్కువ అంచనా వేసింది.

    రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని భారత్ భావిస్తోంది.

    Details

     ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం

    భారత జట్టు ఈ ఏడాది ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది.

    ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బెంగళూరు పిచ్‌ను పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా మార్చటానికి కృషి చేశారు.

    కానీ తొలి టెస్టులో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు విజయం సాధించడంతో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌటయ్యింది.

    ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ పుణె టెస్టులో ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే వారు స్పిన్ పిచ్‌ను సహజంగా ఉంచాలని క్యూరేటర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.

    టీమ్‌లో ఉన్న రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు సమస్యల్ని తేవడం ఖాయంగా ఉంది.

    Details

    వ్యూహాలకు పదును పెడుతున్న భారత్

    పుణె పిచ్ మొదటి రెండు రోజుల్లో ఫాస్ట్ బౌలర్లకు సహకారం అందిస్తుంది. కానీ మూడో రోజున స్పిన్నర్లు తమ పని చేయడం ప్రారంభిస్తారు.

    ఐదో రోజున, బ్యాటర్లు బంతి గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టమవుతుంది.

    తొలి టెస్టులో ఓటమి తర్వాత, న్యూజిలాండ్ జట్టు భారత స్పిన్ పిచ్‌తో సవాళ్లు ఎదుర్కొంటుందని అంచనా వేస్తోంది.

    సీనియర్ ప్లేయర్ డార్లీ మిచెల్ ప్రకారం, వారు పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    న్యూజిలాండ్

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    టీమిండియా

    Ind vs Ban Day 2: రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం  క్రీడలు
    Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత రోహిత్ శర్మ
    Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన రిషబ్ పంత్  రిషబ్ పంత్
    Team India: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం బంగ్లాదేశ్

    న్యూజిలాండ్

    NZ Vs AFG: వరుసగా నాలుగో మ్యాచులో న్యూజిలాండ్ విజయం ఆఫ్ఘనిస్తాన్
    Mitchell Santner: భారత్‌తో మ్యాచ్ మాకు పెను సవాల్.. మిచెల్ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు టీమిండియా
    Ind vs NZ preview: ఇండియా-న్యూజిలాండ్.. ప్రపంచకప్‌లో తొలి ఓటమి ఎవరిది?  ప్రపంచ కప్
    Ind vs NZ toss: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్  ప్రపంచ కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025