NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WPL 2025: ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    WPL 2025: ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి
    ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి

    WPL 2025: ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై ఇండియన్స్‌ను ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ గొప్ప విజయాన్ని సాధించింది. మ్యాచ్ విజయం ఎవరి సాధనమవుతుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది.

    విజయానికి రెండు పరుగులు అవసరమైన సమయంలో అరుంధతి రెడ్డి తెలివిగా ఆడుతూ రెండుపరుగులు పూర్తి చేసి దిల్లీకి గెలుపును అందించింది.

    దీంతో ముంబై ఇండియన్స్ నిరాశకు గురైంది. మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

    ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయినా చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది.

    Details

    చివరి బంతికి రెండు పరుగులు చేసిన అరుంధతి రెడ్డి

    విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ కీలక ఓవర్‌ను ముంబై కెప్టెన్ ఎస్ సంజనకు అప్పగించింది. మొదటి బంతికే నిక్కీ ప్రసాద్ బౌండరీ కొట్టింది.

    రెండో బంతికి రెండు పరుగులు రాగా, మూడో, నాలుగో బంతులకు ఒక్కో పరుగు వచ్చింది. ఐదో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో నిక్కీ ప్రసాద్ ఔటయ్యింది.

    ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో, అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడి రెండుపరుగులు పూర్తి చేసి ఢిల్లీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

    ముంబై ఇండియన్స్ తరఫున నాట్ స్కివేర్-బృంట్ 80 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 42 పరుగులు సాధించగా, మిగతా బ్యాట్స్‌వుమెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

    Details

    నిక్కీ ప్రసాద్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

    ఢిల్లీ బౌలర్ అన్నాబెల్ సుతేర్లాండ్ 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన ఇచ్చింది.

    లక్ష్య ఛేదనలో ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది.

    షఫాలీ వర్మ 18 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి మెరిసింది. నిక్కీ ప్రసాద్ 35 పరుగులతో రాణించడంతో ఢిల్లీ ఉత్కంఠభరిత పోరులో గెలిచింది.

    బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతిభ చూపిన నిక్కీ ప్రసాద్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఢిల్లీ క్యాపిటల్స్

    తాజా

    Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం ఎలాన్ మస్క్
    Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం   డొనాల్డ్ ట్రంప్
    G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలు నరేంద్ర మోదీ
    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఢిల్లీ క్యాపిటల్స్

    WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే క్రికెట్
    ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు..? క్రికెట్
    ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా సత్యనాదేళ్ల క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025