NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rohit Sharma: టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rohit Sharma: టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?
    టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?

    Rohit Sharma: టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 27, 2025
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో టీమిండియా రాణిస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలు సాధించిన భారత్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.

    ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.

    నెట్ రన్ రేట్ ఆధారంగా కివీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మార్చి 2న జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను ఆక్రమిస్తుంది.

    అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది.

    Details

    ప్రాక్టీస్‌కు హాజరుకాని రోహిత్

    న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

    హిట్ మ్యాన్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బుధవారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.

    అయితే రోహిత్ శర్మ మాత్రం ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు.

    పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ రోహిత్ తొడ కండర నొప్పితో ఇబ్బంది పడినట్లు కనిపించింది. దీంతో కివీస్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

    Details

    గిల్ కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్

    రోహిత్ దూరమైతే వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ జట్టును నడిపించే అవకాశం ఉంది. అలాగే తుది జట్టులో కొన్ని మార్పులు కూడా ఉండొచ్చు.

    మహ్మద్ షమీకి కూడా ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం.

    ఒకవేళ రోహిత్ శర్మ గైర్హాజరైతే, కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశముంది.

    రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి వికెట్ కీపర్-బాట్స్‌మెన్ రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

    ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే టీమిండియా సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నా కివీస్‌పై గెలిచి గ్రూప్-ఏ టాపర్‌గా నిలవాలనే లక్ష్యంతో ఉంది.

    మ్యాచ్‌కు ఇంకా మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ
    టీమిండియా

    తాజా

    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి జీవనశైలి
    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్

    రోహిత్ శర్మ

    IND vs AUS : వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు టీమిండియా
    Rohit Sharma: రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిఫికేషన్ క్రికెట్
    Axar Patel: తండ్రైన అక్షర్ పటేల్.. ముందే చెప్పిన రోహిత్ శర్మ! అక్షర్ పటేల్
    Rohit Sharma: రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో కీల‌క మార్పు.. బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా! మిచెల్ స్టార్క్

    టీమిండియా

    Trisha Gongidi: ఫైనల్‌లో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్ క్రికెట్
    Virat Kohli: రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ.. రోజుకి పారితోషకం ఎంతంటే? విరాట్ కోహ్లీ
    U-19 Womens T20 World Cup: గొంగడి త్రిష మెరుపులతో అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత్ సొంతం! క్రికెట్
    IND vs ENG : అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం అభిషేక్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025