NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు బీసీసీఐ షాక్..భారీ జ‌రిమానా..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు బీసీసీఐ షాక్..భారీ జ‌రిమానా..
    పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు బీసీసీఐ షాక్..భారీ జ‌రిమానా..

    Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు బీసీసీఐ షాక్..భారీ జ‌రిమానా..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు ముగిశాయి.

    బుధవారం చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమి చెందడంతో, అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

    ఈ మ్యాచ్‌ను పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఈ విజయంలో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.

    అయితే మ్యాచ్ అనంతరం అతనికి బీసీసీఐ షాక్ ఇచ్చింది. మెల్లగా ఓవర్లు వేసిన కారణంగా బీసీసీఐ అతనిపై రూ.12 లక్షల జరిమానా విధించింది.

    వివరాలు 

    చాహల్ నాలుగు వికెట్లు

    మ్యాచ్ విషయానికి వస్తే..చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 19.2 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఆలౌటైంది.

    బ్యాటింగ్‌లో సామ్ కర్రాన్ అత్యుత్తమంగా రాణించి 47 బంతుల్లో 88 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేశాడు.

    అతడికి తోడుగా డెవాల్డ్ బ్రెవిస్ 32 పరుగులు చేశాడు.పంజాబ్ బౌలింగ్ విభాగంలో చాహల్ నాలుగు వికెట్లు తీశాడు.

    అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సన్ చెరో రెండు వికెట్లు తీసారు.

    హర్ప్రీత్ బ్రార్, అజ్మతుల్లా తలో ఓ వికెట్ తీసుకున్నారు.

    పంజాబ్ జట్టు 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

    వివరాలు 

    పంజాబ్ జట్టు స్లోఓవర్ రేట్‌ నమోదు

    ప్రభ్ సిమ్రాన్ సింగ్ 36 బంతుల్లో 54 పరుగులతో మెరిశాడు. వీరిద్దరి హాఫ్ సెంచరీలతో పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

    చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణా చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

    ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు స్లోఓవర్ రేట్‌ను నమోదుచేసింది. నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోవడంతో బీసీసీఐ, కెప్టెన్ అయ్యర్‌పై జరిమానా విధించింది.

    ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ జట్టు ఈ తప్పును చేసిన మొదటి ఘటన ఇదే కావడంతో, బీసీసీఐ ప్రకటనలో రూ.12 లక్షల జరిమానాను పేర్కొంది.

    వివరాలు 

    పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ 

    చెన్నైపై ఈ విజయం ద్వారా పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

    ఇప్పటివరకు పంజాబ్ 10 మ్యాచ్‌లు ఆడగా, ఆందులో 6 గెలిచింది. మూడింటిలో ఓడిపోయింది,

    మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 13 పాయింట్లు ఉండగా, నెట్ రన్‌రేట్ +0.199గా ఉంది.

    లీగ్ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, అందులో కనీసం రెండు మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రేయస్ అయ్యర్

    తాజా

    Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన భారతదేశం
    Donald Trump: భారత్-పాక్ కాల్పుల విరమణను అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్టు డొనాల్డ్ ట్రంప్
    IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు? ఐపీఎల్
    BLA: పాక్‌కు మరో ఎదురు దెబ్బ.. 39 ప్రాంతాల్లో బలూచిస్థాన్ మెరుపుదాడులు పాకిస్థాన్

    శ్రేయస్ అయ్యర్

    ఆసీస్‌తో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం క్రికెట్
    INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..? క్రికెట్
    టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..! క్రికెట్
    ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025