NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు.. ఈసారి ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు.. ఈసారి ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా?
    శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు.. ఈసారి ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా?

    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు.. ఈసారి ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 05, 2025
    03:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా, ఫైనల్లోకి ప్రవేశించింది.

    బ్యాటింగ్‌లో రాణించిన విరాట్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.

    ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ, జోష్ ఇంగ్లిస్ క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. అందరూ కోహ్లీకే 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు దక్కుతుందని ఊహించారు. అయితే ఈసారి ఈ గౌరవం శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)ను వరించింది.

    ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడుతున్న అలెక్స్ కేరీ రనౌట్ కావడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. నేరుగా స్టంప్స్‌ను గిరాటడం ద్వారా కేరీ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

    ఫీల్డింగ్‌లో అతని ఈ అద్భుత కృషి కారణంగా 'బెస్ట్ ఫీల్డర్' మెడల్ అయ్యర్‌కు దక్కింది.

    Details

    రవిశాస్త్రి చేతులమీదుగా అవార్డు

    ఇంతకుముందు శిఖర్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్‌లో మెడల్ అందించగా, ఈసారి ప్రత్యేక అతిథిగా భారత మాజీ ప్రధాన కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి (Ravi Shastri) వచ్చారు.

    టీమ్‌ను అభినందించిన తర్వాత, శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' మెడల్‌ను అందజేశారు. సాధారణంగా 'బెస్ట్ ఫీల్డర్' మెడల్ కోసం ముగ్గురినే ఎంపిక చేస్తారు.

    కానీ ఈసారి ఆసీస్‌తో జరిగిన సెమీస్ తర్వాత నలుగురిని నామినేట్ చేశారు.

    శ్రేయస్ అయ్యర్‌తో పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli), రవీంద్ర జడేజా (Ravindra Jadeja), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఈ జాబితాలో ఉన్నారు.

    Details

    ఫైనల్‌కు సిద్ధమైన భారత్

    ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్, నలుగురి ఫీల్డింగ్ కృషిని ప్రశంసించి, భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగించాలని అభినందించారు.

    ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు అర్హత సాధించింది.

    మార్చి 9న జరిగే ఫైనల్‌లో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రేయస్ అయ్యర్
    రవిశాస్త్రీ

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    శ్రేయస్ అయ్యర్

    ఆసీస్‌తో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం క్రికెట్
    INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..? క్రికెట్
    టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..! క్రికెట్
    ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ క్రికెట్

    రవిశాస్త్రీ

    ఆస్ట్రేలియా దిగ్గజానికి దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రవిశాస్త్రి క్రికెట్
    పనిభారం ఎక్కువైతే ఐపీఎల్‌ ఆడటం మానేయండి : రవిశాస్త్రి క్రికెట్
    సూర్యకుమార్ యాదవ్.. కొన్ని బంతులను ఎదుర్కో : రవిశాస్త్రి ఐపీఎల్
    ప్లేయర్స్ నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నారని రవిశాస్త్రి ఫైర్ ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025