NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Gautam Gambhir: గంభీర్ కోచింగ్‌లో భారత ప్రదర్శన పేలవం.. టీ20ల్లో మాత్రమే సత్తాచాటిన టీమిండియా
    తదుపరి వార్తా కథనం
    Gautam Gambhir: గంభీర్ కోచింగ్‌లో భారత ప్రదర్శన పేలవం.. టీ20ల్లో మాత్రమే సత్తాచాటిన టీమిండియా
    గంభీర్ కోచింగ్‌లో భారత ప్రదర్శన పేలవం

    Gautam Gambhir: గంభీర్ కోచింగ్‌లో భారత ప్రదర్శన పేలవం.. టీ20ల్లో మాత్రమే సత్తాచాటిన టీమిండియా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 06, 2025
    11:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపిన తరువాత, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.

    2024 టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పదవిని గంభీర్‌కు అప్పగించారు.

    అతని కోచింగ్‌లో భారత్ మెరుగైన ఫలితాలు సాధించగలదని అందరూ భావించారు.

    కానీ, ఆరు నెలలు గడిచాక, పరిస్థితి అంతగా సానుకూలంగా మారలేదు. గతంతో పోల్చితే, భారత్ ప్రదర్శన మరింత పతనమయ్యింది.

    వివరాలు 

    గంభీర్ కోచింగ్‌పై ప్రశ్నలు

    గంభీర్, ద్రవిడ్ బాధ్యతలను తీసుకున్న తరువాత టెస్టులు, వన్డేలు, టీ20ల కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

    కానీ, టీ20ల మినహా, ఇతర ఫార్మాట్‌లలో భారత్ ఆశాజనకమైన ఫలితాలు సాధించలేదు. సరికదా, కొన్ని దారుణమైన ఫలితాలను ఎదుర్కొంది.

    ఇది గంభీర్ కోచింగ్‌పై విమర్శలను తెచ్చుకుంది. గంభీర్, తనను అనుసరించే కోచ్‌లుగా అభిషేక్ నాయర్ (బ్యాటింగ్ కోచ్), ర్యాన్ టెన్ డస్కాటే (ఫీల్డింగ్ కోచ్), మోర్నీ మోర్కెల్ (బౌలింగ్ కోచ్) వంటి దక్షిణాఫ్రికా, ఐపీఎల్ కేకేఆర్ లో పనిచేసిన కోచ్‌లను జట్టులోకి తీసుకున్నాడు.

    ఈ నిర్ణయం, జట్టు మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకున్నట్లు బీసీసీఐ అంగీకరించింది.

    కానీ, ఆరు నెలల తర్వాత గంభీర్ నేతృత్వంలో జట్టు ఏ స్థాయిలో ఉందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    వివరాలు 

    గంభీర్ కోచింగ్‌లో ఇప్పటివరకు భారత జట్టు ప్రదర్శన ఎలా ఉందంటే..

    గంభీర్ వచ్చాక.. టెస్టులు, వన్డేల్లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది.

    ముఖ్యంగా టెస్టుల్లో 10 మ్యాచులు ఆడి మూడు మాత్రమే గెలిచింది, ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది, ఒక మ్యాచ్ డ్రా అయింది.

    అంటే, టెస్టుల్లో 30% విజయాలే నమోదయ్యాయి. వన్డేల్లో, 3 మ్యాచుల్లో ఒకటి కూడా గెలవలేకపోయింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయి, ఒకటి డ్రా అయింది.

    కానీ, టీ20ల్లో మాత్రం భారత్ మంచి ప్రదర్శన కనబర్చింది, ఆడిన ఆరు మ్యాచుల్లోనూ గెలిచింది. ఈ సమయంలో, వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా 4 మ్యాచులు ఆడి అన్నింట్లోనూ గెలిచారు.

    వివరాలు 

    గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో ప్రధాన వైఫల్యాలు.. 

    27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోవడం

    స్వదేశంలో టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరుకి ఆలౌట్ కావడం

    స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 36 ఏళ్ల తర్వాత కోల్పోవడం

    12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓటమి

    24 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్

    41 ఏళ్ల తర్వాత స్వదేశంలో 4 టెస్టులు ఓడిపోవడం

    పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గౌతమ్ గంభీర్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    గౌతమ్ గంభీర్

    రాహుల్‌ను విమర్శించిన మాజీ ప్లేయర్స్‌కి మాసాలా కావాలి : గౌతమ్ గంభీర్ క్రికెట్
    కోహ్లీ, గంభీర్ మధ్య మళ్లీ ఫైట్.. ఇద్దరికీ భారీ ఫైన్ విరాట్ కోహ్లీ
    Virat Vs Gambhir: నా కళ్లకంటిన మట్టితో సమానం.. గొడవ ఇక్కడే మొదలైంది! విరాట్ కోహ్లీ
    ధోనీ వల్ల ఆ రెండు వరల్డ్ కప్‌లను గెలవలేదు.. యువరాజ్ వల్లే గెలిచాం : గంభీర్ ఎంఎస్ ధోని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025