NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం
    కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం

    కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 10, 2023
    01:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే నెట్స్ లో శ్రమించింది. వచ్చే బుధవారం నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

    అయితే తొలి రోజులు ఫాస్ట్ బౌలర్లదే పైచేయిగా నిలిచే అవకాశం ఉందని ఇప్పటికే పిచ్ క్యూరేటర్ విడుదల చేసిన పలు నివేదికలు చెబుతున్నాయి.

    మరోవైపు ఆఖరి రెండు రోజులు స్పిన్నర్లు విజృభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    ప్రపంచంలోనే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత బ్యాట్స్ మెన్లు మొదటి రెండు రోజులు కరేబియన్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనున్నారు.

    భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు 98 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాయి. ఈనెల 12 నుంచి 16 మధ్య 99వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

    DETAILS

    అందరికంటే ఇంగ్లండ్ జట్టుతోనే భారత్ ఎక్కువ మ్యాచ్ లు ఆడింది

    మొత్తంగా వెస్టిండీస్ 30 మ్యాచ్‌ల్లో గెలవగా, టీమిండియా మాత్రం కేవలం 22 మ్యాచ్‌లు గెలవడం గమనార్హం. మరో 46 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకుండా పోయింది.

    అయితే 2002 నుంచి విండీస్‌తో తలపడ్డ టెస్టుల్లో భారత జట్టు ఒక్కటి కూడా ఓడిపోకపోవడం సానుకూలం ప్రభావం చూపిస్తోంది.

    మరోవైపు భారత్ తో 100 టెస్ట్ మ్యాచ్‌లాడిన మూడో జట్టుగా వెస్టిండీస్ చరిత్రకెక్కనుంది. వెస్టిండీస్‌ కంటే ముందు మరో రెండు అగ్రశ్రేణి జట్లు ఉన్నాయి.

    ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో టీమిండియా 100 టెస్ట్ మ్యాచ్‌లపైనే తలపడింది.

    భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లను ఇంగ్లీష్ జట్టుతోనే ఆడింది. ఏకంగా 131 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ - ఇంగ్లాండ్ తలపడ్డాయి.

    DETAILS

    వెస్టిండీస్ తో గెలుపు ఓటమిల కంటే డ్రాగా ముగిసిన మ్యాచ్‌ల శాతమే ఎక్కువ

    ఆస్ట్రేలియాతో భారత్ 107 టెస్టులను పూర్తి చేసుకుంది. మొత్తంగా 570 టెస్టుల్లో 172 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది.

    176 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 221 టెస్టులు డ్రా కాగా ఒకటి టైగా ముగిసింది.

    దీంతో టెస్ట్ ఫార్మాట్లో భారత్ గెలుపు శాతం 30.17గా రికార్డైంది. ఓటముల శాతం 30.87గా నమోదైంది. డ్రాగా ముగిసిన మ్యాచ్‌ల శాతం 38.77గా ఉంది.

    అయితే భారీ అంచనాలతో కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన టీమిండియాకు విజయం దక్కుతుందా లేదా ఆతిథ్య జట్టు భారత్ ను నిలువరిస్తుందా అనేది ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల చర్చకు దారితీసింది.

    భారత జట్టు శక్తివంతంగానే కనిపిస్తున్నా ఫాస్ట్ బౌలింగ్ కు స్వర్ఘధామంగా నిలిచే కరేబియన్ గడ్డపై ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కు సవాల్ ఎదురుకానుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    2002 తర్వాత ఒక్క మ్యాచ్ ఓడిపోని టీమిండియా

    India have lost just one Test series in West Indies since 2000.

    It was way back in 2002 when they lost by 2-1 in a five-match series.#TeamIndia | #WestIndies | #WIvIND pic.twitter.com/DUt6esTOdh

    — Cricket.com (@weRcricket) July 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    భారతదేశం
    వెస్టిండీస్
    టీమిండియా

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    క్రికెట్

    సెంచరీతో విజృంభించిన వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు టీమిండియా
    హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై టీమిండియా
    CWC Qualifiers: శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. గాయం కారణంగా తప్పుకున్న దుష్మంత చమీరా  శ్రీలంక
    CWC Qualifiers: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జింబాబ్వే సారిథి సీన్ విలియమ్స్ జింబాబ్వే

    భారతదేశం

    బ్రిటన్‌: నాటింగ్‌హామ్ కత్తి దాడిలో ముగ్గురు మృతి; అందులో భారతీయ సంతతి యువతి బ్రిటన్
    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు
    అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్  అమెరికా
    కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ బ్యాంక్

    వెస్టిండీస్

    వెస్టిండిస్ టెస్టు జట్టులో సీనియర్ పేసర్ రీ ఎంట్రీ క్రికెట్
    వెస్టిండీస్ మెంటర్‌గా బ్రియన్ లారా క్రికెట్
    వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జింబాబ్వే సై క్రికెట్
    సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ క్రికెట్

    టీమిండియా

    7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా! సంజు శాంసన్
    పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. కారణమిదే! ఐసీసీ
    INDvsWI: టీ20 జట్టులోకి తెలుగు తేజం.. ఇక విండీస్ బౌలర్లకు చుక్కలే!  క్రికెట్
    రాత్రి అంతా పార్టీ చేసుకొని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025