Page Loader
INDIA VS AUS : బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

INDIA VS AUS : బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 22న ప్రారంభం కానుంది. 22న తొలి వన్డే- మొహాలీ 24న రెండో వన్డే- ఇండోర్ 27న మూడో వన్డే- రాజ్‌కోట్ వేదికగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే తొలి రెండు వన్డేలకు రోహిత్, కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ లకు విశ్రాంతినిస్తున్నట్లు వెల్లడించింది. కేఎల్ రాహుల్‌ కెప్టెన్‌‌గా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా మ్యాచులు జరగనున్నాయి.మూడో వన్డేకు మాత్రం కెప్టెన్‌‌, వైస్ కెప్టెన్‌లుగా రోహిత్, హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నారు. తొలి 2 వన్డేలకు 15 మందిని ప్రకటించిన సెలెక్టర్లు, ఆఖరి మ్యాచుకు 17 మందిని ఎంపిక చేశారు.అన్నీ వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమై డే/నైట్ కింద జరగనున్నాయి.

DETAILS

తొలి రెండు వన్డేలకు కెప్టెన్సీ చేయనున్న కేఎల్ రాహుల్

తొలి 2 వన్డేల జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ మూడో వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post