NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?
    తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?

    Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 02, 2023
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈనెల 3న నెదర్లాండ్స్‌తో జరిగే వార్మప్ మ్యాచు కోసం టీమిండియా ఇప్పటికే కేరళలోని తిరువనంతపురంకు చేరుకుంది.

    అయితే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత ఎమర్జెన్సీ కారణంగా జట్టుతో కలిసి రాలేదని తెలుస్తోంది.

    అతను సడన్ గా ముంబైకి వెళ్లినట్లు స్పోర్ట్స్ మీడియా సంస్థలు ధ్రువీకరించాయి. కోహ్లీ యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకొని ముంబాయి విమానం ఎక్కినట్లు సమాచారం.

    వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు జట్టును వీడినట్లు తెలిసింది. ఇక కోహ్లీ సోమవారం తిరిగి జట్టుతో చేరనున్నారు.

    Details

    రెండో వార్మప్ మ్యాచులో టీమిండియాతో తలపడనున్న నెదర్లాండ్స్

    విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండోసారి తల్లికాబోతున్నట్లు ఇటీవల జోరుగా వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ ముంబైకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    ఇటీవల వీరిద్దరూ ముంబయిలోని ఓ గైనకాలజీ ఆస్పత్రి వద్ద కనిపించనట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

    2017లో కోహ్లీ, అనుష్క వివాహం జరగ్గా, 2021 జనవరిలో వీరికి వామిక జన్మించిన విషయం తెలిసిందే.

    రెండో వార్మప్ మ్యాచులో టీమిండియా, నెదర్లాండ్స్ తో అక్టోబర్ 3న తలపడనుంది.

    ఇక ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    టీమిండియా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    విరాట్ కోహ్లీ

    వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ ఐపీఎల్
    విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ ఇదే! ఐపీఎల్
    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ క్రికెట్
    ముందు ఇంగ్లీష్ నేర్చుకోండ్రా.. కోహ్లీ ఫ్యాన్స్ పై దాదా అగ్రహం సౌరబ్ గంగూలీ

    టీమిండియా

    IND Vs BAN : టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్ రోహిత్ శర్మ
    MS Dhoni: యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని (Video) ఎంఎస్ ధోని
    Team India: చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా రోహిత్ శర్మ
    IND vs SL : భారత్-శ్రీలంక మధ్య రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది! ఆసియా కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025