Page Loader
ICC U-19 Womens World Cup: నేటి నుంచి మలేసియా వేదికగా అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌
నేటి నుంచి మలేసియా వేదికగా అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌

ICC U-19 Womens World Cup: నేటి నుంచి మలేసియా వేదికగా అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల క్రికెట్‌ జట్టులో మరో ప్రధాన టోర్నమెంట్‌ ఆరంభం కానుంది. మలేసియాను వేదికగా ఈ రోజు అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత జట్టు మలేసియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో కలిసి గ్రూప్‌-ఎలో ఉంది. నికీ ప్రసాద్‌ నాయకత్వంలోని టీమిండియా ఆదివారం తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో తెలుగు రాష్ట్రాల నుంచి గొంగడి త్రిష, షబ్నమ్‌ షకీల్, ద్రితి కేసరి పాల్గొంటున్నారు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్కాట్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఒక్కో గ్రూప్‌లో పై మూడు స్థానాల్లో నిలిచిన జట్లు 'సూపర్‌ సిక్స్‌'కు అర్హత పొందుతాయి.

Details

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి గట్టి పోటీ

ఈ 12 జట్లను సూపర్‌ సిక్స్‌లో రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫైనల్‌కు పోటీ పడతారు. సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకోవాలనుకునే ప్లేయర్లు ఈ టోర్నమెంట్‌లో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎడిషన్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు ఈసారి కూడా టైటిల్‌ నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి భారత యువజట్టుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.