Page Loader
ఆ ఐదు సిక్సర్లతో నా జీవితం మారిపోయింది: రింకూ సింగ్  
ఐర్లాండ్ తో జరిగిన టీ20లో 38పరుగులు చేసిన రింకూ సింగ్

ఆ ఐదు సిక్సర్లతో నా జీవితం మారిపోయింది: రింకూ సింగ్  

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 22, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రింకూ సింగ్, ప్రస్తుతం భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో రింకూ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐర్లాండ్‌తో రెండు మ్యాచులు పూర్తయ్యాయి. ఈ రెండు మ్యాచుల్లో ఇండియానే గెలిచింది. మొదటి మ్యాచులో రింకూ సింగ్ కి బ్యాట్ చేసే అవకాశం రాలేదు. రెండవ మ్యాచులో మాత్రం రింకూ సింగ్ చెలరేగిపోయాడు. మొత్తం 21బంతులు ఆడిన రింకూ సింగ్, 2ఫోర్లు, 3సిక్సర్లు బాది 38పరుగులు చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు.

Details

జీవతాన్ని మార్చిన ఐదు సిక్సర్లు 

మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్ రవి బిష్నోయ్, రింకూ సింగ్ ని ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన రింకూ సింగ్, మొదటి మ్యాచ్ లో అవకాశం కోసం ఎదురుచూసాననీ, కానీ రెండవ మ్యాచులో అవకాశం వచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకున్నానని అన్నాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై ఐదు సిక్సర్లు బాదిన విషయాన్ని రవి బిష్ణోయ్ గుర్తు చేయగా, ఆ ఐదు సిక్సర్లతో తన జీవితం మారిపోయిందని, అప్పటి నుండి తనను అందరూ గుర్తుపడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఐర్లాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో సిరీస్ దక్కించుకున్న టీమిండియా, మూడవ మ్యాచును రేపు ఆడనుంది.