NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs NZ: బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్‌ ఆట కష్టమే!  
    తదుపరి వార్తా కథనం
    IND vs NZ: బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్‌ ఆట కష్టమే!  
    బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్‌ ఆట కష్టమే!

    IND vs NZ: బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్‌ ఆట కష్టమే!  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 16, 2024
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీ20 సిరీస్‌తో అభిమానులను అలరించిన టీమిండియా ఇప్పుడు మరో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది.

    అయితే,వర్షం మాత్రం మ్యాచ్‌కి అడ్డంకి సృష్టించడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.

    భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. బెంగళూరులో ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ ఆలస్యం కానుంది.

    వర్షం పడుతున్న కారణంగా టాస్‌ వేయడం సాధ్యం కాలేదు.ఒకవేళ ఈ క్షణం వర్షం ఆగినా, మైదానాన్ని సిద్ధం చేసేందుకు కనీసం అరగంట నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంది.

    ఆ తర్వాతే టాస్‌ వేస్తారు.టాస్‌ వేసిన తర్వాత ఆట ప్రారంభం కావడానికి కనీసం 15 నుంచి 30 నిమిషాల సమయం పట్టాల్సి ఉంటుంది.

    వివరాలు 

    అత్యాధునిక టెక్నాలజీతో..

    దీంతో,తొలి రోజు మొదటి సెషన్‌ ఆట సాధ్యపడడం చాలా కష్టంగా కనిపిస్తోంది అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఎంత భారీ వర్షం పడినా మ్యాచ్‌ను సిద్ధం చేయగల టెక్నాలజీ బెంగళూరు మైదానంలో ఉంది.

    నిమిషానికి పదివేలు లీటర్ల నీటిని పీల్చగల సామర్థ్యం కలిగిన సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ ఇక్కడ ఉంది.

    దీని ద్వారా వర్షం ఆగిన వెంటనే పిచ్‌తోపాటు మైదానం చిత్తడిగా లేకుండా చేసేందుకు వీలుంది.

    అయితే, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కొనసాగితే, తొలి రోజు ఆటను చూడడం కష్టమయ్యే అవకాశముంది.

    వివరాలు 

    సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ ఏం చేస్తుంది? 

    కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌ దాదాపు 10ఏళ్ళ నుంచి సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ను వినియోగిస్తోంది.

    ఇది తొలిసారి 2015లో భారత్ - దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌ కోసం ప్రవేశపెట్టింది. పిచ్‌తోపాటు, మైదానంలోని పచ్చిక కింద వివిధ లేయర్లలో ఇసుకను ఉపయోగించారు.

    మిగతా మైదానాల్లో ఎక్కువగా మట్టిని నింపుతారు,కానీ ఇక్కడ ఇసుక ఉండటంతో నీరు మైదానంలో ఉండకుండా మెషిన్‌ స్టార్ట్‌ చేయగానే బయటకు వచ్చేస్తుంది.

    ఇందుకు 200 హార్స్‌పవర్‌ యంత్రాలతో సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ పనిచేస్తుంది.

    అక్కడినుంచి నీటిని డ్రైనేజ్‌ల ద్వారా బయటకు పంపిస్తారు. ఆ తర్వాత డ్రయర్లతో, రోప్స్‌తో గ్రౌండ్‌ను రెడీ చేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    క్రికెట్

    Vinod Kambli: నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు  క్రీడలు
    VVS Laxman: ఇంకో ఏడాది పాటు ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌.. కాంట్రాక్టు పొడిగించిన బీసీసీఐ క్రీడలు
    Punjab Kings : 'పంజాబ్ కింగ్స్'లో విబేధాలు.. ఆయనపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్ ఐపీఎల్
    ACA Elections : ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని స్పోర్ట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025