NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli: టీమిండియా ఆటగాళ్లనుప్రశంసల్లో ముంచెత్తుతున్న ఆస్ట్రేలియా మీడియా 
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli: టీమిండియా ఆటగాళ్లనుప్రశంసల్లో ముంచెత్తుతున్న ఆస్ట్రేలియా మీడియా 
    టీమిండియా ఆటగాళ్లనుప్రశంసల్లో ముంచెత్తుతున్న ఆస్ట్రేలియా మీడియా

    Virat Kohli: టీమిండియా ఆటగాళ్లనుప్రశంసల్లో ముంచెత్తుతున్న ఆస్ట్రేలియా మీడియా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 12, 2024
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా,భారతదేశం మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

    ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ముందుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. ఆదివారం రోజున ఈ స్టార్ బ్యాటెర్ పెర్త్ చేరుకున్నాడు.

    ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతని ప్రదర్శన పేలవంగా ఉండడంతో,ఈ సిరీస్‌లో రాణించేందుకు అతను గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

    టీమ్‌ఇండియాకు చెందిన యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ కూడా ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.

    గత కొంతకాలంగా టెస్టుల్లో అతను నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు, అందువల్ల ఈ సిరీస్‌లో అతనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

    మరోవైపు, ఆస్ట్రేలియా మీడియా కోహ్లీ, యశస్వి జైస్వాల్‌లను ప్రశంసలతో ముంచెత్తుతోంది, వీరిద్దరినీ ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ పత్రికలు కథనాలు ప్రచురించాయి.

    వివరాలు 

    'కొత్త రాజు'యశస్వి జైస్వాల్‌ 

    ఆస్ట్రేలియాలోని 'ది డైలీ టెలిగ్రాఫ్' పత్రిక కోహ్లీ ఫోటోను ఫ్రంట్ కవర్ పేజీలో ప్రచురించింది.

    అందులో అతని వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో ఆడిన మ్యాచ్‌ల వివరాలు, పరుగులు, సెంచరీలు వంటి వివరాలను పొందుపరిచింది.

    గతంలో ఈ పత్రిక యశస్వి జైస్వాల్‌ను 'కొత్త రాజు' అనే అర్థం వచ్చేలా హెడ్డింగ్‌ పెట్టింది. అతని శైలి, ప్రదర్శనపై ప్రత్యేక కథనం అందించింది.

    భారత క్రీడాభిమానులు ఈ ఫోటోలు,కథనాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    వివరాలు 

    భారత్ ఈ సిరీస్‌ను 4-0తో గెలవాల్సిన అవసరం 

    భారత జట్టుకు ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చాలా కీలకమైనది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా, భారత్ ఈ సిరీస్‌ను 4-0తో గెలవాల్సిన అవసరం ఉంది.

    స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చెందిన భారత జట్టు ఈ సిరీస్‌లో కంగారుల గడ్డపై ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    యశస్వీ జైస్వాల్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    విరాట్ కోహ్లీ

    Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత మైదానంలో నిరాశకు గురైన కోహ్లీ (వీడియో) టీమిండియా
    Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే?  అజిత్ అగార్కర్
    Shivam Dube: కోహ్లీ, యువరాజ్ సరసన చేరిన ఆల్ రౌండర్ శివమ్ దూబే  టీమిండియా
    Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం  బీసీసీఐ

    యశస్వీ జైస్వాల్

    అరంగేట్రం మ్యాచులోనే రికార్డులను బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్ క్రీడలు
    Yashasvi Jaiswal: హాఫ్ సెంచరీతో రికార్డుల వర్షం కురిపించిన యశస్వీ జైస్వాల్ రోహిత్ శర్మ
    Yashasvi Jaiswal: తప్పు అంతా నాదే.. అందుకే క్షమాపణ చెప్పా : యశస్వీ జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్
    Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌పై యశస్వీ జైస్వాల్ సూపర్ సంచరీ  ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025