LOADING...
Virat Kohli: తెర వెనక నిజం విరాట్‌ ఎప్పటికీ బయట పెట్టకపోవచ్చు : మనోజ్‌ తివారీ
తెర వెనక నిజం విరాట్‌ ఎప్పటికీ బయట పెట్టకపోవచ్చు : మనోజ్‌ తివారీ

Virat Kohli: తెర వెనక నిజం విరాట్‌ ఎప్పటికీ బయట పెట్టకపోవచ్చు : మనోజ్‌ తివారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న అయిదు టెస్టుల సిరీస్‌కు ముందే, 2025 మే 12న అతడు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. నిజానికి ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా సిద్ధమైన కోహ్లీ, రంజీ మ్యాచ్‌ల్లో కూడా పాల్గొన్నాడు. అయితే అకస్మాత్తుగా టెస్ట్‌ రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక కారణం ఏమిటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ (Manoj Tiwary) తన అభిప్రాయం వెల్లడించాడు. వాస్తవానికి తెర వెనక ఏమి జరిగిందో నాకు తెలియదు, అది విరాట్‌కే తెలుసు.

Details

రిటైర్మెంట్ నిర్ణయం ఆశ్చర్యపరిచింది

కానీ అతడు ఆ విషయం ఎప్పటికీ బయట పెట్టకపోవచ్చని నా భావన. కోహ్లీ ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాడు. భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి చెందుతున్నాడు. ఆధ్యాత్మిక చింతన కలిగినవారు వర్తమానాన్నే ముఖ్యంగా భావిస్తారు. గతం గురించి మాట్లాడటానికి ఇష్టపడరని తివారీ అభిప్రాయపడ్డాడు. అలాగే, "కోహ్లీ ఇంకా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు టెస్ట్‌ క్రికెట్‌ ఆడగలిగే స్థాయిలో ఉన్నాడు. అతని ఫిట్‌నెస్‌ స్థాయి అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్‌ సిరీస్ కోసం సిద్ధమయ్యాడు. అందువల్ల అతడి రిటైర్మెంట్ నిర్ణయం నన్ను మాత్రమే కాదు, అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Details

టెస్టుల్లో 9,230 పరుగులు చేసిన విరాట్

అసలు కారణం ఏంటనేది క్రికెట్ విశ్లేషకులకు కొంతవరకు తెలిసి ఉండవచ్చు. తన చుట్టూ ఉన్న వాతావరణం విరాట్‌కు నచ్చకపోయి ఉండవచ్చని వ్యాఖ్యానించాడు. విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకు భారత్ తరఫున 123 టెస్టులు ఆడి, 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. అందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా 68 టెస్టులు నడిపి, వాటిలో 40 మ్యాచ్‌లు గెలిపించాడు. 17 టెస్టుల్లో మాత్రం జట్టు ఓటమి చవిచూసింది. రాబోయే అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ ద్వారా కోహ్లీ మరోసారి అంతర్జాతీయ వేదికపై కనిపించే అవకాశం ఉంది.