
IND vs ENG: 'బుమ్రాకు మద్దతెక్కడ..?'.. ఇతర బౌలర్లపై రవిశాస్త్రి ఆగ్రహం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో (India vs England) టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుని 471 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటలో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) మినహా మిగతా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీయగా, మరో ఎండ్ నుంచి మద్దతే రాలేదు. దీంతో మాజీ క్రికెటర్లు బుమ్రా ప్రదర్శనను ప్రశంసిస్తూనే, ఇతర బౌలర్లపై తీవ్ర విమర్శలు గుప్పుతున్నారు. భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) మాట్లాడుతూ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్లు ఒక్క వికెట్ కూడా తీయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Details
మిగతా బౌలర్లు మద్దతు ఇవ్వాలి
ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఇతర బౌలర్లు రాణించకపోవడం బాధకరమని, వారు వెంటనే తమ రితాన్ని కనుక్కోవాలని సూచించారు. 'సిరీస్ ముందుకు సాగే కొద్దీ బుమ్రా పనిభారంపై నేను ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే, ప్రతి స్పెల్లోనూ వికెట్లు తీయాల్సిన బాధ్యత అతడిపైనే పడుతోంది. మిగతా బౌలర్లు కూడా అతడికి మద్దతివ్వాలని శాస్త్రి ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ అన్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ కూడా శాస్త్రితో ఏకీభవించారు. 'టీమ్ఇండియాలోని ఇతర బౌలర్లతో బుమ్రాను పోలిస్తే తేడా స్పష్టంగా కనబడుతోంది. అతడు అసాధారణ బౌలర్. క్యాచ్లు నేలపాలు కాకపోతే అతడికి మరిన్ని వికెట్లు వచ్చేవి. ఆట ఇంకా మొదట్లోనే ఉంది. మిగతా బౌలర్లు కూడా రాబోయే రోజుల్లో సిరీస్లో ప్రభావం చూపిస్తారని నాసర్ వ్యాఖ్యానించారు.
Details
మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
ఓపెనర్ జాక్ క్రాలీని మొదటి ఓవర్లోనే స్లిప్ క్యాచ్ ద్వారా ఔట్ చేసిన బుమ్రా జట్టులో ఉత్సాహం నింపాడు. అతని బుల్లెట్ బంతులను ఆడలేక డకెట్, పోప్ తడబడిపోయారు. దీంతో తర్వాత కూడా వికెట్ల పతనం ఉంటుందనిపించింది. కానీ 15 పరుగుల వద్ద డకెట్ ఇచ్చిన క్యాచ్ను జడేజా వదిలేయడం ఇంగ్లండ్కు కలిసొచ్చింది. డకెట్ తదుపరి చెలరేగి ఆడగా, పోప్ కూడా తడబడుతూ రాణించాడు.క్రమంగా ఈ ఇద్దరిపై ఉన్న ఒత్తిడి తగ్గిపోయింది. బుమ్రా 48 పరుగులకే మూడు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు కలిపి 154 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి నిలిచింది.