NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారు?.. ప్లేయర్ల పేర్లను ప్రకటించిన మాజీ క్రికెటర్లు 
    తదుపరి వార్తా కథనం
    IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారు?.. ప్లేయర్ల పేర్లను ప్రకటించిన మాజీ క్రికెటర్లు 
    భారత్-పాక్ మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారు?.. ప్లేయర్ల పేర్లను ప్రకటించిన మాజీ క్రికెటర్లు

    IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారు?.. ప్లేయర్ల పేర్లను ప్రకటించిన మాజీ క్రికెటర్లు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 17, 2025
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో, ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ ఎంతో ఆసక్తిని రేపుతుంది.

    ఎందుకంటే ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతాయి.

    ఈ పోరును ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 23న దుబాయ్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌పై పలువురు మాజీ క్రికెట్ ఆటగాళ్లు తమ అంచనాలను వెల్లడించారు.

    ఈమ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లపై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్, పాక్‌ మాజీ కెప్టెన్లు ఇంజమామ్, షాహిద్‌ అఫ్రిదీ తమ అభిప్రాయాలను చెప్పారు.

    యువరాజ్‌సింగ్ భారత తరఫున శుభ్‌మన్‌ గిల్ అత్యధిక పరుగులు చేస్తారని, బంతితో మహమ్మద్‌ షమీ ఎక్కువ వికెట్లు తీస్తారని అంచనా వేశారు.

    Details

    23న భారత్, పాక్ మ్యాచ్

    పాక్‌ తరఫున షాహిద్‌ అఫ్రిదీ బాబర్‌ అజామ్‌ బ్యాట్‌తో, షాహిన్‌ అఫ్రిదీ బంతితో ప్రావీణ్యం చూపిస్తారని చెప్పారు. ఇంజమామ్‌ పాక్‌ తరఫున బాబర్‌ అజామ్‌తో పాటు హారిస్‌ రవూఫ్‌ పేరును ప్రస్తావించారు.

    ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి, యువరాజ్‌ దుబాయ్‌ పరిస్థితుల ఆధారంగా పాకిస్థాన్‌ సానుకూలంగా స్పందించడాన్ని గమనించవచ్చు.

    ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్-పాక్ ఇరు జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. వీటిలో పాకిస్థాన్‌ మూడు మ్యాచ్‌లలో గెలిచింది. భారత్ రెండు సార్లు విజయం సాధించింది.

    ఇప్పుడు రోహిత్‌ శర్మ సేన దుబాయ్‌లో పాకిస్థాన్‌పై గెలిచి ఈ లెక్కను సరి చేయాలని భావిస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఈనెల 19 నుంచి ప్రారంభమవుతుంది.

    పాకిస్థాన్‌తో 23న మ్యాచ్‌ జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    ఛాంపియన్స్ ట్రోఫీ

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    ఐసీసీ

    T20 World Cup 2024: Icc మహిళల T20 ప్రపంచ కప్ అధికారిక పాట విడుదల టీ20 ప్రపంచకప్‌
    IND vs PAK: టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్ టీమిండియా
    IND w Vs AUS w: థర్డ్ అంపైర్‌ ఎల్బీ నిర్ణయంపై వివాదం.. భారత్ పరాజయానికి కారణం ఇదేనా? టీమిండియా
    ICC Hall of Fame: భారత మహిళా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్ఠాత్మక గౌరవం క్రికెట్

    ఛాంపియన్స్ ట్రోఫీ

    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ టీమిండియా
    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం క్రీడలు
    Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ  రోహిత్ శర్మ
    Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..! క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025