NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WTC 2023-25: డ‌బ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు ద‌క్కే ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    WTC 2023-25: డ‌బ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు ద‌క్కే ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?
    డ‌బ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు ద‌క్కే ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?

    WTC 2023-25: డ‌బ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు ద‌క్కే ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 11, 2025
    11:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌ ఈరోజు ప్రారంభం కానుంది.

    ప్రెస్టీజియస్ టైటిల్ కోసం దక్షిణాఫ్రికా జట్టు , ఆస్ట్రేలియా జట్లు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో తలపడనున్నాయి.

    ఫైనల్‌కు ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో విజేతలకు, రన్నరప్‌కి ఇవ్వబోయే ప్రైజ్‌మనీ వివరాలను వెల్లడించింది.

    అలాగే మూడో స్థానంలో నిలిచిన భారత జట్టుకు లభించనున్న పారితోషికం కూడా ప్రకటించారు.

    వివరాలు 

    భారత్‌కి భారీ ప్రైజ్‌మనీ 

    ఈసారి ఇండియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత పొందకపోయినా, టోర్నీ మొత్తంలో మూడో స్థానంలో నిలిచింది.

    అందుకే టీమిండియాకు కూడా ప్రైజ్‌మనీగా రూ.12.33 కోట్లు (సుమారు 1.48 మిలియన్ డాలర్లు) ఇవ్వనున్నారు.

    ఇక ఫైనల్‌లో గెలిచే జట్టుకు 3.6 మిలియన్ల డాలర్లు (అందునా దాదాపు రూ.30 కోట్లు) లభించనున్నాయి.

    రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.17.5 కోట్లు) అందజేస్తారు.

    వివరాలు 

    ఇప్పటివరకు WTC ప్రదర్శన ఎలా ఉందంటే? 

    ఈ డబ్ల్యూటీసీ సైకిల్ రెండేళ్ల పాటు 9 జట్ల మధ్య జరిగింది.

    ఇందులో దక్షిణాఫ్రికా 69.44 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

    మొత్తం 19 టెస్టులు ఆడిన దక్షిణాఫ్రికా, వాటిలో 13 విజయాలు నమోదు చేసింది.

    ఇక ఆస్ట్రేలియా 67.54 శాతం పాయింట్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.

    ఇప్పుడు ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడుతూ, విజేతగా అవతరించేందుకు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి.

    వివరాలు 

    ఒకరు టైటిల్ నిలబెట్టుకోవాలనుకుంటే, మరొకరు చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు 

    ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 2023లో జరిగిన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి టైటిల్‌ను అందుకుంది.

    అందువల్ల ఈసారి ఆ టైటిల్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది.

    మరోవైపు టెంబా బవుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా తొలిసారి టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలవాలనే దృష్టితో ప్రయత్నిస్తోంది.

    ఈ విజయంతో సుదీర్ఘ చరిత్రలో తమ కీర్తిపతాకాన్ని మరింత ఎత్తులో ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    తాజా

    USCIS: జూలై వీసా బులెటిన్ విడుదల.. గ్రీన్ కార్డు ఆశావాహులకు తాత్కాలిక ఊరట! వీసాలు
    WTC 2023-25: డ‌బ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు ద‌క్కే ప్రైజ్‌మ‌నీ ఎంతంటే? వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    AS Ravikumar: టాలీవుడ్ డైరెక్టర్‌ ఏఎస్‌ రవికుమార్ కన్నుమూత.. సంతాపం ప్రకటించిన దర్శకుల సంఘం టాలీవుడ్
    Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి కెన్యా

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!  క్రికెట్
    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్ క్రికెట్
    టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..? క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025