NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: పాకిస్థాన్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఉగ్రదాడి.. 10 మంది సరిహద్దు పోలీసులు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Pakistan: పాకిస్థాన్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఉగ్రదాడి.. 10 మంది సరిహద్దు పోలీసులు మృతి 
    పాకిస్థాన్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఉగ్రదాడి

    Pakistan: పాకిస్థాన్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఉగ్రదాడి.. 10 మంది సరిహద్దు పోలీసులు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    05:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరానికి సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది.

    ఈ దాడిలో 10 మంది పోలీసులు చనిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    'తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్' అనే గ్రూప్ ఈ దాడికి తాము బాధ్యులమని ప్రకటించింది.

    ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది, సీనియర్ పోలీస్ అధికారులు ఈ దాడిని ధ్రువీకరించారు.

    పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు అవుట్‌పోస్ట్‌లోకి చొరబడి బోర్డర్ కాస్టబులరీ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యులను మట్టుబెట్టారు.

    వివరాలు 

    తాలిబాన్ నాయకుడు ఉస్తాద్ ఖురేషీ హత్యకు ప్రతీకారంగా ఈ దాడి

    సీనియర్ తాలిబాన్ నాయకుడు ఉస్తాద్ ఖురేషీ హత్యకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు పాక్ తాలిబాన్లు చెప్పారు.

    ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలోని బజౌర్ జిల్లాలో, ఇంటెలిజెన్స్ ఆధారిత సమాచారంతో పాక్ ఆర్మీ దాడులు నిర్వహించింది.

    ఈ దాడుల్లో ఖురేషీతో పాటు తొమ్మిది మంది మరణించారు. ఈ ప్రతీకారానికి ఉగ్రవాదులు దాడి చేశారు.

    పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో ఉగ్రవాదం, దక్షిణంలో బలూచిస్తాన్‌లో వేర్పాటువాదంతో పాకిస్తాన్ పోరాడుతున్నది.

    వాయువ్య ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్సులో పాకిస్తాన్ తాలిబాన్ల ప్రభావం కొనసాగుతోంది. వీరు తరచూ పాక్ ఆర్మీ, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉంటారు.

    మరోవైపు, బలూచిస్తాన్‌కు స్వాతంత్య్రం కావాలని కోరుకునే ''బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)'' పాకిస్తాన్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పాకిస్థాన్

    Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం భారతదేశం
    Pakistan : పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ; 20 మంది మృతి అంతర్జాతీయం
    New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ నరేంద్ర మోదీ
    T20 World Cup 2024: పాకిస్థాన్ జ‌ట్టుకు కొత్త జెర్సీ.. 'మ్యాట్రిక్స్' థీమ్ అర్థ‌మిదే..! క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025