Pakistan Encounter: పాకిస్థాన్లో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు.. 8 మంది ఉగ్రవాదులు మృతి
పాకిస్థాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా నిఘా ఆధారిత ఆపరేషన్ (ఐబీఓ) నిర్వహించారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమైనట్లు ISPR తెలిపింది. హతమైన ఉగ్రవాదులు భద్రతా బలగాలతో పాటు అమాయక పౌరులకు వ్యతిరేకంగా అనేక ఉగ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశం నుండి ఉగ్రవాద ముప్పును తుడిచిపెట్టాలని భద్రతా దళాలు నిశ్చయించుకున్నందున, ఇతర ఉగ్రవాదులను అంతమొందించడానికి ఈ ప్రాంతంలో శానిటైజేషన్ ఆపరేషన్ జరుగుతోందని పేర్కొంది.