NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Brics Summit: బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై  భారీ సైబర్‌ దాడులు..! 
    తదుపరి వార్తా కథనం
    Brics Summit: బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై  భారీ సైబర్‌ దాడులు..! 
    బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై భారీ సైబర్‌ దాడులు..!

    Brics Summit: బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై  భారీ సైబర్‌ దాడులు..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2024
    08:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. బుధవారం ఈ సదస్సు జరుగుతున్న సమయంలో, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖపై సైబర్ దాడులు జరిగినట్లు అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.

    "బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సమయంలో, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌పై విస్తృతంగా సైబర్ దాడులు జరిగాయి. మంత్రిత్వశాఖ సేవలను దెబ్బతీసే విధంగా 'డీడీఓఎస్' దాడులు జరిగినట్లు గుర్తించాం. మంత్రిత్వశాఖ తరచూ ఇలాంటి దాడులను ఎదుర్కొంటున్నప్పటికీ, తాజా దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి" అని ఆమె చెప్పారు.

    వివరాలు 

    దౌత్యం, చర్చలకు భారత్ మద్దతు 

    ఇదిలా ఉండగా, ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తదితర దేశాధినేతలు హాజరయ్యారు.

    సదస్సులో ప్రసంగించిన మోదీ, దౌత్యం, చర్చలకు భారత్ మద్దతు తెలుపుతుందని, యుద్ధానికి మాత్రం వ్యతిరేకమని పునరుద్ఘాటించారు.

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా పరిస్థితులు, ఉగ్రవాదం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

    మరోవైపు, ఈ కూటమిలో చేరేందుకు 30 దేశాలు ఆసక్తి చూపుతున్నాయని పుతిన్ తెలిపారు.

    భారత ఆర్థిక వృద్ధిపై ప్రసంసలు కురిపిస్తూ, బ్రిక్స్ దేశాలకు భారత్ ఒక ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్యా
    సైబర్ నేరం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    రష్యా

    Flight : వీసా,పాస్‌పోర్ట్, టిక్కెట్ లేకుండానే విమానయానం.. అమెరికాలో అడుగుపెట్టిన రష్యన్ విమానం
    Ukraine Christmas: చరిత్రలో తొలిసారిగా డిసెంబర్ 25న ఉక్రెయిన్‌లో క్రిస్మస్.. రష్యా సంప్రదాయానికి చెక్ క్రిస్మస్
    Japan: జపాన్‌ను తాకిన సునామీ.. 5అడుగుల ఎత్తులో అలలు.. రష్యా, కొరియా అప్రమత్తం  జపాన్
    Russian Military Plane: కూలిన రష్యా విమానం ..విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు  ఉక్రెయిన్

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025