NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి
    తదుపరి వార్తా కథనం
    Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి
    Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి

    Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 12, 2024
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎర్ర సముద్రంలో (Red Sea)వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్‌ (Houthis)పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు శుక్రవారం ప్రతీకార దాడులు ప్రారంభించాయి.

    యెమెన్‌లో (Yemen) హౌతీల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించినట్లు రాయిటర్స్‌ ధృవీకరించింది.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం మాట్లాడుతూ.. "హౌతీలు నేరుగా అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛపై హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. దానికోసం వారు ఉపయోగించిన యెమెన్‌లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేశాం. అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛను రవాణాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోం'' అని హెచ్చరించారు.

    హౌతీ అధికారి రాజధాని సనాలో సాదా,ధామర్ నగరాలతో పాటు హోడైదా గవర్నరేట్‌లో "దాడులు" చేసినట్లు ధృవీకరించారు.

    Details 

    యూరప్, ఆసియా కీలక మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం

    ఒక US అధికారి, అక్కడి పరిస్థితిపై మాట్లాడుతూ, విమానం, ఓడ, జలాంతర్గామి ద్వారా దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

    గాజాను నియంత్రించే పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్‌కు మద్దతుగా తమ దాడులు జరుగుతున్నాయని హౌతీలు చెబుతున్నారు.

    హౌతీలు ఇప్పటి వరకు 27 నౌకలపై దాడి చేశారు. దింతో ప్రపంచ షిప్పింగ్ ట్రాఫిక్‌లో 15% వాటా కలిగిన యూరప్, ఆసియా కీలక మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగింది.

    అంతకుముందు గురువారం, హౌతీల నాయకుడు యుఎస్ దాడి పై స్పందించారు. యెమెన్‌లోని తమ స్థావరాలపై దాడికి తీవ్ర సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

    Details 

    ఎర్రసముద్రంలో 27 దాడులు చేసిన హౌతీలు

    గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోని అంతర్జాతీయ షిప్పింగ్ లేన్‌లపైకి హౌతీలు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారని, గత ఏడాది నవంబర్ 19 నుంచి హౌతీలు ఇప్పటి వరకు ఎర్రసముద్రంలో 27 దాడులు చేసిందని US మిలిటరీ గురువారం తెలిపింది.

    గత ఏడాది డిసెంబరులో, 20 కంటే ఎక్కువ దేశాలు US నేతృత్వంలోని సంకీర్ణంలో పాల్గొనడానికి అంగీకరించాయి.

    దీనిని ఆపరేషన్ ప్రాస్పిరిటీ గార్డియన్ అని పిలుస్తారు.ఇది ఎర్ర సముద్రంలో వాణిజ్య ట్రాఫిక్‌ను కాపాడుతుంది.

    అయితే, US, బ్రిటీష్ దాడులు ఆ రక్షణాత్మక కూటమి వెలుపల జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, బహ్రెయిన్,కెనడానెదర్లాండ్స్ ఆపరేషన్‌కు మద్దతు ఇచ్చాయని బైడెన్ చెప్పారు.

    ఈ నిర్లక్ష్యపు దాడులకు అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందన ఐక్యంగా,దృఢంగా ఉంది" అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    బ్రిటన్

    తాజా

    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్

    అమెరికా

    America Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు  గుజరాత్
    Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హత్యకు కుట్ర.. విచారణ కమిటీని ఏర్పాటు చేసిన భారత్ ఖలిస్థానీ
    America : 100వ ఏటా కన్నుమూసిన US మాజీ సెక్రటరీ, నోబెల్ విజేత హెన్రీ కిస్సింజర్ అంతర్జాతీయం
    Blinken : పన్నన్ హత్య కుట్రపై భారత ఉద్యోగి పాత్ర.. సీరియస్'గా తీసుకుంటున్నామన్న బ్లింకెన్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌

    బ్రిటన్

    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ రష్యా
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025