NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ 
    తదుపరి వార్తా కథనం
    Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ 
    భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌

    Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    10:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు, ఆందోళనకరమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో భారత టీవీ ఛానళ్లను బంగ్లాదేశ్‌లో నిషేధించాలని కోరుతూ అక్కడి హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలయింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా కథనాల్లో వెల్లడించింది.

    బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు లాయర్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. భారత టీవీ ఛానళ్లు బంగ్లాదేశ్‌ విరుద్ధంగా ప్రచారం చేస్తున్నాయని న్యాయవాది ఆరోపించారు.

    ఈ రకమైన దుష్ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలకు హాని కలిగించే అవకాశం ఉందని, దీనివల్ల బంగ్లాదేశ్‌ సార్వభౌమత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

    ఈ పిటిషన్‌పై హైకోర్టు వచ్చే వారంలో విచారణ జరపనుందని సమాచారం.

    వివరాలు 

    హిందువులు భారీ స్థాయిలో నిరసనలు

    ఇస్కాన్‌ సంస్థ బంగ్లాదేశ్‌లోని హిందువులకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఇస్కాన్‌ ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ పాల్గొన్నారు.

    ఆయనపై బంగ్లాదేశ్‌ జెండాను అవమానించడం అనే ఆరోపణలు చేశారు. దీనిపై ఢాకా పోలీసులు చిన్మయ్‌ను అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

    ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు.

    ఈ నిరసనలలో ఓ న్యాయవాది మరణించడంతో, ఇస్కాన్‌ను నిషేధించాలని మరో న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.

    అయితే, ఢాకా హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో దానిపై అటార్నీ జనరల్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

    వివరాలు 

    మూడు దేవాలయాలపై దాడులు

    అలాగే, బంగ్లాదేశ్‌ చటోగ్రామ్‌లో జరిగిన హిందూ వ్యతిరేక దాడుల్లో, కొందరు ఆందోళనకారులు మూడు దేవాలయాలపై దాడులు జరిపారు.

    ఈ ఘటనలపై స్పందించిన భారత్‌... దేశంలో మైనారిటీలు సహా అందరి ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడాలని, ఢాకా ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్

    తాజా

    Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..! రక్షణ శాఖ మంత్రి
    IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ! ఐపీఎల్
    India-Pak War : ఈనెల 18 వరకు భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు ఆర్మీ
    Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు డొనాల్డ్ ట్రంప్

    బంగ్లాదేశ్

    Shakib Al Hasan: బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదు షకీబ్ అల్ హసన్
    Shiekh Hasina: షేక్ హసీనాపై నాలుగు కొత్త హత్య కేసులు నమోదు.. మాజీ మంత్రి ఘాజీ అరెస్ట్ అంతర్జాతీయం
    Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్ళీ చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు అంతర్జాతీయం
    Bangladeshi diplomats: భారత్‌లోని ఇద్దరు బంగ్లాదేశ్‌ దౌత్యవేత్తలపై సస్పెన్షన్ షేక్ హసీనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025