NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Joe Biden:జో బైడెన్ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు  
    తదుపరి వార్తా కథనం
    Joe Biden:జో బైడెన్ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు  
    జో బైడెన్ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు

    Joe Biden:జో బైడెన్ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 26, 2024
    08:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రిస్మస్ వేళ ఉక్రెయిన్‌లో పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా తీవ్ర దాడులు జరిపిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో మాస్కో దాడుల నుండి కీవ్‌ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించనున్నట్లు ప్రకటిస్తూ, ఈ విషయంపై రక్షణ మంత్రిత్వ శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

    రష్యా దాడుల వెనుక ఉద్దేశం ఉక్రెయిన్ ప్రజలను చలికాలంలో కష్టాల్లో పడేలా చేయడం, విద్యుత్ సరఫరా అందకుండా గ్రిడ్ వ్యవస్థను ధ్వంసం చేయడమేనని బైడెన్ వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    ఉక్రెయిన్‌కు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు

    మరి కొద్దీ రోజులలో బైడెన్ అధ్యక్ష పీఠం నుంచి త్వరలో వైదొలగబోతున్న సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి వచ్చేనాటికి ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాలనే ఉద్దేశంతో వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన బైడెన్ ప్రభుత్వం, అదనంగా 988 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించనున్నట్లు హామీ ఇచ్చింది.

    2022 నుంచి ఇప్పటి వరకు అమెరికా ఉక్రెయిన్‌కు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయం అందించినట్లు సమాచారం.

    వివరాలు 

    70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు 

    ఇటీవలి కాలంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేసింది. అదే సమయంలో ఉత్తరకొరియా దళాలు మాస్కోకు మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ పరిస్థితుల్లో కీవ్ తనను రక్షించుకునేందుకు బైడెన్ కార్యవర్గం పెద్ద మొత్తంలో ఆయుధాలను అందిస్తోంది.

    క్రిస్మస్ పర్వదినాన కూడా రష్యా ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో దాడులు నిర్వహించింది.

    అయితే, వాటిలో 50 క్షిపణులు, పలు డ్రోన్లను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జో బైడెన్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    జో బైడెన్

    Biden: బందీల విడుదలకు త్వరలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం: బైడెన్  ఇజ్రాయెల్
    Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా  అమెరికా
    Joe Biden : గాజా పౌరుల ప్రాణాలను రక్షించాలి.. కానీ హమాస్'పై యుద్ధం ఆగిపోకూడదు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    US President Convoy: బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌‍పై తుపాకులు గురిపెట్టిన భద్రతా సిబ్బంది  అమెరికా

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్
    'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన మోల్డోవా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025